Wednesday, 26 March 2025 04:50:01 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

Telangana: ద్రవ్యవినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

Date : 31 July 2024 06:04 PM Views : 107

Studio18 News - TELANGANA / : ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, నిరసనల మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేటీఆర్ చర్చను ప్రారంభించారు. సభలో ఏం జరిగిందో ప్రజలు చూశారు: సబితా ఇంద్రారెడ్డి సభలో ఏం జరిగిందో అందరూ చూశారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... మీ వెనుక అక్కలు మమ్మల్ని ముంచారు... మిమ్మల్ని కూడా ముంచుతారని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి అలా ఎందుకు మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, దానిని పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడి ఉంటారన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందే తాము ఆ పార్టీ కోసం కష్టపడ్డామన్నారు. తనతో పాటు సునీతా రెడ్డి ఆ పార్టీ కోసం పని చేశామన్నారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో తనకు, సునీతారెడ్డికి మాత్రమే అవమానం జరిగినట్లు కాదన్నారు. మహిళలందరికీ ఇది అవమానమే అన్నారు. సీఎం స్థాయిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తాను అసెంబ్లీకి వచ్చి 24 ఏళ్లవుతోందని... ఈ కాలంలో చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డిలను చూశానన్నారు. కానీ తమను అనడం ద్వారా రేవంత్ రెడ్డి ఆ సీటుకు ఉన్న గౌరవాన్ని తగ్గించారన్నారు. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుందనడం సరికాదన్నారు. అక్కలు అంటే అందరి క్షేమాన్ని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. సభలో తమ సమాధానం వినకుండానే వారు పారిపోయారన్నారు. దేశంలో చాలామంది పార్టీ మారుతుంటారని... అదేం పెద్ద తప్పేమీ కాదన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డికి పార్టీ మారడం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తాను బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచానని... అలాంటి తనపై మాట్లాడే హక్కు ఎక్కడిదన్నారు. అసెంబ్లీలో కూడా ఆడబిడ్డలను అవమానించే సంస్కృతి రావడం దారుణమన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :