Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : పాండిచ్చేరిలోని తిరునల్లార్లో గల ప్రసిద్ధ ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయంలో శని పేర్చి పవిత్ర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుంభ రాశి నుండి మీన రాశికి శని గ్రహం మారిన సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుండి 45 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 6, 7, 8 తేదీలలో సుమారు ఆరు లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి శని భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శని పేర్చి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు. ఆలయ 27వ పీఠాధిపతి మహా సన్నిధానం శ్రీ లా శ్రీ కైలై మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామిగళ్ వారి ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా తులసమ్మ చారిటబుల్ ఫౌండేషన్, సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ నందనపాటి రాము ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఐదవ సారి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయంలో హోమాలు, శని భగవానుడి అభిషేకాలు నిర్వహించగా నందనపాటి రాము కుటుంబ సభ్యులు, సోలిస్ హాస్పిటల్ సిబ్బంది భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ధర్బరణ్యేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శివ శ్రీ టి. రాజస్వామి నాథ శివాచార్యులు, మాలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హరివర్ధన్ రెడ్డి, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, కరైకల్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మీ సౌజన్య, కరైకల్ కలెక్టర్ ఇషితా రాఠి, ఈఓ సుబ్రమణ్యం, కాప్రా మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, శంకర్ బాబు, విజయేందర్ రెడ్డి, గజేందర్, మోహన్, అరికపూడి ప్రసాద్, డాక్టర్ కె. వెంకటేశ్వర ప్రసాద్, డాక్టర్ కోటేశ్వరరావు, యుఎస్ఏ బాలాజీ, వెంకట రాజు, మేధా సురేష్, మాజీ ఏపీ లేబర్ కమిషన్ శ్రీనివాసరావు తదితరులతో పాటు సోలిస్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News