Sunday, 08 March 2026 10:07:07 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్

Date : 16 September 2024 01:53 PM Views : 535

Studio18 News - TELANGANA / : Minister Ponnam Prabhakar : గణేశ్ నవరాత్రులు విజయవంతం అయ్యాయని, గణనాథుల నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని పొన్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 131 క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300కుపైగా క్రేన్లు అందుబాటులో ఉంచామని వివరించారు. శివారు ప్రాంతాల్లో చెరువులు, మిని పాండ్స్ లో వినాయకుల నిమజ్జనం చేసుకు అవకాశం ఉందని తెలిపారు. త్వరగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభం అవుతుందని తెలిపారు. 70ఏళ్ల అనుభవం ఉత్సవ కమిటీకి ఉంది.. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుందని అన్నారు. సాగర్ వైపు వచ్చే వినాయక నిమజ్జన వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారికి సహాయం అందించేందుకు మా అలెర్ట్ టీంలు సిద్ధంటా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వం తరపున నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనోత్సవాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :