Monday, 17 March 2025 11:47:16 PM
# Seethakka: విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణ # Telangana Govt: తెలంగాణ శాస‌న‌స‌భ‌లో కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌భుత్వం # Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

ఆ రోజు మద్యం దుకాణాలు బంద్.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు

Date : 16 September 2024 12:58 PM Views : 88

Studio18 News - TELANGANA / : Ganesh Immersion 2024: గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకమైన గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ప్రతిష్ట ఏర్పాట్లు చేసింది. విగ్రహాల ఊరేగింపు, ట్రాఫిక్, శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. ముఖ్యంగా ట్రాంక్ బండ్ పై వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం 17వ తేదీ (మంగళవారం) జరగనుంది. గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈనెల 17న గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ ఘాట్, హెస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డుకు నిమజ్జనానికి వెళ్లే వారు ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవచ్చు. వినాయక నిమజ్జనాలు జరిగే మంగళవారం రోజు అర్థరాత్రి 1గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి స్టేషన్ల నుంచి అర్థరాత్రి 1గంటకు బయలుదేరి.. గమ్యస్థానానికి రెండు గంటల వరకు చేరుకుంటాయి. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి రద్దీ వేళల్లో అదనపు మెట్రో ట్రిప్పులు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వినాయక నిమజ్జనాలు జరిగే 17వ తేదీ (మంగళవారం) రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశిస్తూ కమిషనర్ సుదీర్ బాబు నోటిఫికేషన్ జారీ చేశారు. 17వ తేదీ ఉదయం 6గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు శని, ఆదివారాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం అర్థరాత్రి 12గంటల వరకు మహాగణపతి దర్శనానికి నిర్వాహకులు భక్తులకు అనుమతి ఇచ్చారు. ఆ తరువాత దర్శనం నిలిపివేశారు. మంగళవానం నిమజ్జన కార్యక్రమం ఉండటంతో సోమవారం ఆ ఏర్పాట్లను నిర్వాహకులు చేసుకోనున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :