Monday, 08 December 2025 03:14:47 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Palla Rajeshwar Reddy: ఎమ్మెల్యేగా ఉన్న నాపైనే నాలుగు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Date : 09 August 2024 04:42 PM Views : 250

Studio18 News - TELANGANA / : ఒక ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే నాలుగు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. పల్లా జనగామలో ఆందోళన చేస్తున్న న్యాయవాదుల దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. న్యాయవాద దంపతులపై పోలీసుల దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... న్యాయవాదులపై దాడికి పాల్పడిన పోలీసులను బదిలీ చేయడంతో సరిపెట్టవద్దని... ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. దొంగలను, దోపిడీదారులను పట్టుకోమని పోలీసులను పెడితే, పోలీసులే దొంగలుగా మారి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల సమస్యలపై తాను శాసనసభలో ప్రస్తావిస్తానన్నారు. కాగా, జనగామలో న్యాయవాద దంపతులపై దాడి ఘటన పట్ల పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ఇన్స్‌పెక్టర్, ఎస్సైలను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. ఇది చదవండి: న్యాయవాదుల ఆందోళనతో స్పందించిన ఉన్నతాధికారులు .. పోలీసులపై చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :