Tuesday, 10 March 2026 04:09:24 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

మహిళా శక్తికి ప్రెస్ క్లబ్ ఘన వందనం

Date : 09 March 2026 07:11 PM Views : 66

Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్–హెచ్-2843) మరియు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీసిఎస్ అధికారిణి వేల్పుల విజేత మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తి జీవితంలో కూడా మహిళలు ముందంజలో నిలవడం సమాజానికి ఆదర్శమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే పురుషుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, ఈరోజు తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన భర్త అందించిన సహకారమే కారణమని విజేత భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రతి మహిళ తన లక్ష్యాలను చేరుకోవాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ముఖ్యమని, భర్త వెన్నుదన్నుగా నిలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టించగలరని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ హారిక నాయుడు మాట్లాడుతూ మహిళా సాధికారత మాటల్లోనే కాకుండా కార్యరూపంలో కనిపించాలన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టుల సేవలను కొనియాడుతూ, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో మహిళా విలేకరులు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గౌరవరపు జగదీష్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారిణి రమాదేవి, న్యాయవాది శృతి, ఏఎస్ఐ పి. లక్ష్మి, విలేకరి నవజీవన ప్రియ, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షుడు ఎలుగోటి వెంకట్రావు, ప్రెస్ క్లబ్ కోశాధికారి భద్రయ్య, జిల్లెల మహేష్, యాంకర్ నాయిని స్వాతి, యాంకర్ హర్షిక, యాంకర్ రేష్మ, అంతోటి నాగమణి, గౌరవరపు సునీత తదితరులతో పాటు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విలేకరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :