Monday, 17 March 2025 04:05:49 PM
# Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు # Bhumana Karunakar Reddy: పవనానందుల గొంతుక ఇప్పుడెందుకు మూగబోయింది?: భూమన # Sunita Williams: 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ముఖంలో ఆనందం... మాటల్లో వర్ణించలేం! # Youtuber Harsha Sai: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం... యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు # Chandrababu: పదో తరగతి పరీక్షలు రాస్తున్న నా యువ నేస్తాలకు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు # DK Aruna: నిన్న రాత్రి మా ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు: డీకే అరుణ # Revanth Reddy: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారు: సీఎం రేవంత్ రెడ్డి # L2E: Empuraan: మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మోహన్ లాల్ ఎల్2ఈ: ఎంపురాన్ # KA Paul: రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం అనిపించుకోవడం ఒక అన్నగా బాధ కలిగించింది: కేఏ పాల్ # Alleti Maheshwar Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి # Narendra Modi: మేం శాంతిని కోరుకుంటుంటే... పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ # AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం # AR Rahman: నేనింకా రెహమాన్ భార్యనే... ఆడియో సందేశం వెలువరించిన సైరా బాను # Namrata Shirodkar: విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత # Kalyan Ram: ఆమెను 'అమ్మ' అనే పిలుస్తాను: నందమూరి కల్యాణ్ రామ్ # North Macedonia: నైట్‌క్లబ్‌లో ప్రమాదం.. 59 మంది సజీవ దహనం # Umran Malik: ఐపీఎల్‌కు ముందు కోల్‌కతాకు భారీ ఎదురుదెబ్బ.. పేస్ సెన్సేషన్ అవుట్! # Actor Nithiin: పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నిస్తే నితిన్ రిప్లయ్ ఇదే! # Heat Waves: ఏపీలోని ఈ మండలాల్లో నేడు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు!

పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు నన్ను క్షమించరు: రేవంత్ రెడ్డి

సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయ సందర్శన స్వామివారికి ప్రత్యేక పూజలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థా

Date : 10 November 2024 04:11 PM Views : 131

Studio18 News - TELANGANA / : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ పనుల వ్యయం రూ.110 కోట్లు. ఇక సొంత జిల్లాకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు గతంలో అన్యాయం జరిగిందని అన్నారు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎం అయ్యారని, కానీ కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు రాలేదు, ప్రాజెక్టులూ రాలేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని, పాలమూరును సర్వతోముఖాభివృద్ధి చేస్తామని చెప్పారు. పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు తనను క్షమించరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రుణం తీర్చుకుంటానని... మక్తల్, నారాయణపేట్, కొడంగల్ కు కృష్ణా జలాలు తీసుకువస్తామని అన్నారు.

Also Read : పాపం... ఆ మహిళా జర్నలిస్టు నలిగిపోతోంది: పవన్ కల్యాణ్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :