Studio18 News - TELANGANA / : సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కురుమూర్తి స్వామి ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ పనుల వ్యయం రూ.110 కోట్లు. ఇక సొంత జిల్లాకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పాలమూరుకు గతంలో అన్యాయం జరిగిందని అన్నారు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎం అయ్యారని, కానీ కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు రాలేదు, ప్రాజెక్టులూ రాలేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని, పాలమూరును సర్వతోముఖాభివృద్ధి చేస్తామని చెప్పారు. పాలమూరు బిడ్డనై ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు తనను క్షమించరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రుణం తీర్చుకుంటానని... మక్తల్, నారాయణపేట్, కొడంగల్ కు కృష్ణా జలాలు తీసుకువస్తామని అన్నారు.
Also Read : పాపం... ఆ మహిళా జర్నలిస్టు నలిగిపోతోంది: పవన్ కల్యాణ్
Admin
Studio18 News