Friday, 14 February 2025 07:46:45 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Jangaon CI: న్యాయవాదుల ఆందోళనతో స్పందించిన ఉన్నతాధికారులు .. పోలీసులపై చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

Date : 09 August 2024 12:50 PM Views : 120

Studio18 News - TELANGANA / : న్యాయవాద దంపతులపై అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారంలో ఓ సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌పై వేటు వేసింది తెలంగాణ సర్కార్. జనగామ పోలీస్ స్టేషన్‌లో న్యాయవాద దంపతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. జనగామ ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డి, ఎస్ఐ తిరుపతిపై బదిలీ వేటు వేసిన వరంగల్ సీపీ .. కానిస్టేబుల్ బి.కరుణాకర్‌ను ఏఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. బాధితురాలి వివరాలు తెలుసుకునే నిమిత్తం న్యాయవాద దంపతులు ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో వారి పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో న్యాయవాదులు ఆందోళనలు చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాద సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసు ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :