Friday, 14 February 2025 07:10:29 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Telangana Budget 2024 : బడ్జెట్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు భారీగా నిధులు.. మూసీ ప్రక్షాళనకు ఎన్నికోట్లంటే?

Date : 25 July 2024 02:10 PM Views : 65

Studio18 News - TELANGANA / : Telangana Budget 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కాగా.. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తద్వారా రాబోయే కాలంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడూలేని విధంగా భారీ ఎత్తున 10వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు జలమండలికి రూ. 3,385 కోట్లు, సీఎం చైర్మన్ గా వ్యవహరిస్తున్న హైడ్రా కు రూ. 200 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. అదేవిధంగా.. ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ. 100కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు రూ. 200 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు కేగాయించగా.. పాత బస్తీలో మెట్రో మెట్రో విస్తరణఖు రూ. 500 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కొరకు రూ. 50 కోట్లు కేటాయించగా.. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కొరకు రూ. 1,500 కోట్లు రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :