Saturday, 26 April 2025 06:52:05 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆ ఇద్దరిపైనే గురి..! తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్..

Date : 31 August 2024 12:00 PM Views : 106

Studio18 News - TELANGANA / : Gossip Garage : బీజేపీ ఆపరేషన్‌ -2028 స్టార్ట్‌ చేసిందా? సామాజిక సమీకరణలతో ఎన్నికల యుద్ధం చేయాలని నిర్ణయించిందా? రాష్ట్రంలోని రెండు ప్రధాన సామాజికవర్గాల నేతలను పార్టీలో చేర్చుకుని మిషన్‌-2028ని పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తోందా? ఆల్టర్నేట్‌ సర్కార్‌ అంటూ గత ఎన్నికల ముందు ఎంతో హడావుడి చేసిన బీజేపీ… ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వదులుకోకూడదనే ఉద్దేశంతో నాలుగున్నరేళ్ల ముందు నుంచే పక్కా ప్లాన్‌ వేస్తోందంటున్నారు.. 2028 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పావులు.. నాలుగున్నరేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగి… 2028 ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పావులు దుపుతున్నారు కలమం పార్టీ అగ్రనేతలు. పక్కాప్లాన్‌ ప్రకారం పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. సామాజిక సమీకరణలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు… తెరచాటుగా మంత్రాంగం నడుపుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన బీజేపీ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుని 56 చోట్ల ప్రభావం చూపింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు రెట్ల బలం పుంజుకుని అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీసీలు, ఎస్సీలకు దగ్గరవ్వాలని పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన బీజేపీ… లోక్‌సభ ఎన్నికల నాటికి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానం తీసుకుని ఎంఆర్‌పీఎస్‌ మద్దతు పొందింది. దీంతో మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి మేలు జరిగిందని విశ్లేషణలు ఉన్నాయి. మందకృష్ణ బీజేపీలో చేరతారా? ఈ పరిస్థితుల్లో ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణను బీజేపీలో చేర్చుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న మంద కృష్ణమాదిగ బీజేపీలోకి వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. తాను రాజకీయ పార్టీలకు దూరమని మంద కృష్ణమాదిగ చెబుతున్నా, ఆయనను ఎలాగైనా ఒప్పించాలనేది కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు. ఇక ఇదే సమయంలో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్యపైనా బీజేపీ ఫోకస్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్‌.కృష్ణయ్యను తెలంగాణ బీజేపీ అక్కున చేర్చుకునేలా పావులు.. ప్రస్తుతం ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆర్‌.కృష్ణయ్య… ఆ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి 11 మంది ఎంపీలు ఉండగా, ఇప్పటికే ఇద్దరు రాజీనామా చేశారు. ఇక మిగిలిన వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఆర్‌.కృష్ణయ్యను తెలంగాణ బీజేపీ అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. బీసీ సంఘాల నేతగా కృష్ణయ్యకు తెలంగాణలో గుర్తింపు ఉంది. గతంలో ఎల్‌బీ నగర్‌ శాసనసభ్యుడిగానూ ఆయన పనిచేశారు. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకున్న బీజేపీ.. బీసీ వర్గాల నేతను ఆకర్షించడం ద్వారా… వచ్చే ఎన్నికల నాటికి బీసీ ఓటర్లను పోలరైజ్‌ చేసేలా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. వైసీపీ ఎంపీలతోపాటు కృష్ణయ్య బీజేపీలో చేరతారా? లేక సెపరేట్‌గా తెలంగాణ బీజేపీతో కలిసి అడుగులేస్తారా? అన్నది చూడాల్సి వుందంటున్నారు. వైసీపీ ఎంపీల పార్టీ ఫిరాయింపులపై ఒకరిద్దరు ఖండించినా, ఆర్‌.కృష్ణయ్య మాత్రం ఇప్పటివరకు తన స్పందన తెలియజేయలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్‌.కృష్ణయ్య రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారిద్దరి ద్వారా మిషన్‌ 2028 కంప్లీట్‌ చేయాలని బీజేపీ వ్యూహం.. మొత్తానికి ఎంఆర్‌పీఎస్‌ నేత కృష్ణ మాదిగ, బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య ద్వారా మిషన్‌ 2028 కంప్లీట్‌ చేయాలనే బీజేపీ వ్యూహమే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అవుతోంది. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ.. అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం.. దీంతో ఈ రెండు వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కానదేది కమలనాథుల వ్యూహం. అనుకున్న విధంగా అంతా పక్కాగా జరుగుతుందా? లేదా? అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం… ఇప్పటికే తన రాజకీయ ప్రవేశంపై మంద కృష్ణమాదిగ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఆర్‌.కృష్ణయ్య స్పందన ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :