Monday, 17 March 2025 05:48:24 PM
# Revanth Reddy: అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించాం!: రేవంత్ రెడ్డి # Akbaruddin Owaisi: అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్‌లా కాదు: అక్బరుద్దీన్ ఒవైసీ # Court: నానిగారి కోసం 8 నెలలు వెయిట్ చేశాను: 'కోర్ట్' డైరెక్టర్ రామ్ జగదీశ్! # Chandrababu: అందులో ఒక శాతం నా భాగస్వామ్యం ఉన్నందుకు గర్విస్తున్నా: సీఎం చంద్రబాబు # Narendra Modi: ప్రధాని మోదీ ఎదుట గాయత్రీ మంత్రాన్ని పఠించిన అమెరికన్ ఏఐ పరిశోధకుడు ఫ్రిడ్‌మాన్ # Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...! # Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ # DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ # Gauri Spratt: తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌ # Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్ # Corbin Bosch: ముంబయి ఇండియన్స్ ప్లేయ‌ర్‌కు పీసీబీ నోటీసులు... కార‌ణ‌మిదే! # Hyderabad Metro: ఆ యాడ్స్ తొలగించేలా చూడాలంటూ సజ్జనార్ కు నెటిజన్ల విజ్ఞప్తి # Samantha: ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటోతో సమంత ఇన్ స్టా పోస్ట్ # AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రెహమాన్ # Potti Sriramulu: అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం.. సీఎం చంద్రబాబు వెల్లడి # Robin Hood: రాబిన్ హుడ్ సినిమాకు డేవిడ్ వార్నర్ కు పారితోషికం ఎంతంటే..? # Amaravati: ఇక సూపర్ ఫాస్ట్ గా అమరావతి నిర్మాణం... సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీఏ-హడ్కో మధ్య ఒప్పందం # సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ # Baidu: ఏఐ రేసు రసవత్తరం... రెండు కొత్త మోడళ్లను తీసుకువచ్చిన చైనా సంస్థ # Sudeekshs Konanki: డొమినికన్ రిపబ్లిక్ లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం... బీచ్ లో లభ్యమైన దుస్తులు

Cripto Fraud: క్రిప్టో కరెన్సీ పేరిట జగిత్యాలలో రూ.70 లక్షలకు టోకరా

క్రిప్టో బిజినెస్ పేరుతో భారీ మోసం లక్షల్లో మోసపోయామంటూ బాధితుల ఆందోళన సమయం ఇస్తే డబ్బులు చెల్లిస్తానంటూ బాధితులకు నిందితుడి హామీ పోలీసులకు ఫిర్యాదు చ

Date : 13 March 2025 11:53 AM Views : 21

Studio18 News - TELANGANA / : జగిత్యాలలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో బిజినెస్ పేరుతో సుమారు రూ.70 లక్షల వరకు రాకేశ్ అనే వ్యక్తి పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాలకు చెందిన రాకేశ్ తమతో మెటఫండ్ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తమతో రూ.7 లక్షలు పెట్టించాడని, మిగతా కొందరితో రూ.70 లక్షల వరకు పెట్టుబడులు పెట్టించారని వారు వాపోయారు. పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి రాకపోవడంతో వారంతా రాకేశ్ ను నిలదీశారు. దాదాపు 8 నెలలుగా రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బాధితులు కొందరు రాకేశ్ ఇంటి వద్దకు వెళ్లగా, అతను లేకపోవడంతో వారంతా ఆందోళన చేపట్టారు. దీంతో రాకేశ్ కుటుంబ సభ్యులు 100కు డయిల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఫిర్యాదు ఇవ్వాలని బాధితులకు సూచించారు. విషయం తెలియడంతో రాకేశ్ వెంటనే బాధితులతో మాట్లాడాడు. కొంత సమయం ఇస్తే డబ్బులు మొత్తం తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. డబ్బులు అడిగినప్పుడల్లా ఇలానే రాకేశ్ దాటవేస్తూ వస్తున్నాడని బాధితులు ఆరోపించారు. అయితే బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :