Wednesday, 30 April 2025 07:22:38 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన.. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే..

Date : 06 September 2024 11:14 AM Views : 102

Studio18 News - TELANGANA / : Shivraj Singh Chouhan : తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించనున్నారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో పలు జిల్లాల్లో పంట నష్టం వాటిళ్లింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నష్టం ఎక్కువగా వాటిల్లింది. మున్నేరు ఉధృతికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మంలో కేంద్ర మంత్రులు పర్యటన కొనసాగనుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇవాళ విజయవాడలో వరద పరిస్థితులపై వివరించేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ తో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెంనాయుడు, బీజేపీ ఏపీ ప్రెసిడెంట్, ఎంపీ పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు. ఇవాళ ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు భట్టి, బండిసంజయ్ వెళ్లారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి విజయవాడ నుంచి ఖమ్మంకు చేరుకుంటారు. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వీరితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా పాల్గోనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన ఇలా.. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన కొనసాగనుంది. కట్టలూరు, మీనవోలు, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్ ఏరియల్ సర్వే. ఏరియల్ సర్వే అనంతరం కూసుమంచి మండలం జుజ్జురావుపేట గ్రామంలో దెబ్బతిన్న కాలువ, పంట నష్టపోయిన పొలాలను పరిశీలిన. పాలేరు ట్యాంక్ బండ్ పై ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్న శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న కేంద్ర మంత్రులు. శివరాజ్ సింగ్ తో కలిసి రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్న బండి సంజయ్. వరద నష్టంపై సీఎం రేవంత్ తో కలిసి సమీక్షించనున్న కేంద్ర మంత్రులు. సమావేశం అనంతరం భోపాల్ వెళ్లనున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కోదాడ పర్యటనను రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :