Friday, 18 July 2025 07:24:17 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

దాని కోసమే అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ వాడుకుంది: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Date : 03 August 2024 04:18 PM Views : 197

Studio18 News - TELANGANA / : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరు రోజులు జరిగిన ఈ సమావేశాల్లో జీరో అవర్ లేనే లేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కారని, బీఆర్‌ఎస్‌ను తిట్టించేందుకు సమావేశాలను కాంగ్రెస్ వాడుకుందని అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ లేదని, ఏడు నెలల్లో సీఎం రేవంత్ వికృత రూపం చూపించారని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. తప్పుడు పత్రాలతో సీఎం అందరినీ తప్పుదోవ పట్టించారని తెలిపారు. సీఎం ఒక ఆటవిక రాజ్యాధికారిగా వ్యవహరించారని, కాంగ్రెస్ హామీల ఊసే బడ్జెట్‌లో లేదని చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని అన్నారు. జాబ్ క్యాలండర్‌కు చట్టబద్ధత తెస్తామన్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా తమ మహిళా నేతలను అవమాన పరిచారని అన్నారు. సీఎం, మంత్రులు అన్నీ అసత్యాలే చెప్పారని తెలిపారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఏ ప్రభుత్వం అయినా భర్తీ చేస్తుందా అని నిలదీశారు. 75 కోట్ల రూపాయలతో 1.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానన్న భట్టిని కేంద్ర ఇరిగేషన్ మంత్రిని చేయాలని ఎద్దేవా చేశారు. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టులు వెయ్యి కోట్లతో పూర్తి చేయవచ్చని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :