Thursday, 15 May 2025 01:43:04 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Danam Nagender: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు... స్పందించిన దానం నాగేందర్

Date : 10 September 2024 05:56 PM Views : 123

Studio18 News - TELANGANA / : తమపై అనర్హత వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, కానీ వారికి అలా మాట్లాడే నైతిక హక్కు లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తూ... బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ తీర్పుతో శునకానందం పొందుతున్నాయని విమర్శించారు. తాము చేస్తే నీతి... వేరేవాళ్లు చేస్తే అవినీతి అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన వారిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలన్నారు. కుటుంబ పాలన తప్ప వారు చేసిందేమీ లేదన్నారు. ఎమ్మెల్యేలను బానిసలుగా చూశారని మండిపడ్డారు. నా ముందు బచ్చాగాళ్లు కూడా ఇప్పుడు అవాకులు చవాకులు పేలుతున్నారు అంటూ దానం ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీలో విలువ ఇవ్వలేదని, చీడ పురుగుల్లా చూశారని విమర్శించారు. ఇక, బీజేపీ జాతీయస్థాయిలో ఏం చేస్తుందో చూడాలన్నారు. పంజాబ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పుపై లీగల్ సలహాలు తీసుకుంటున్నామని, తీర్పుపై మాత్రం స్పందించనన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్‌కు ఆ దిశగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని, లేదంటే సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :