Sunday, 08 March 2026 10:42:07 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

DK Aruna: ఎన్నిక‌ల క‌లెక్ష‌న్ల కోస‌మే 'హైడ్రా': ఎంపీ డీకే అరుణ‌

Date : 30 August 2024 03:22 PM Views : 696

Studio18 News - TELANGANA / : ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) ను తీసుకువ‌చ్చారు. ఇప్పుడీ సంస్థ క‌బ్జాదారుల‌ను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం చేస్తోంది హైడ్రా. సెల‌బ్రిటీలు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర ప్ర‌ముఖులు అనే తేడా లేకుండా, ఆక్ర‌మ‌ణ రుజువైతే క‌ట్ట‌డాల‌ను కూల్చేయ‌డం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో కొంద‌రు నేత‌లు హైడ్రాకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంటే.. మ‌రికొందరు మాత్రం క‌న్నెర్ర చేస్తున్నారు. ఇక హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నిరుపేద‌ల ఇళ్ల‌ను కూల్చివేయ‌డం ప‌ట్ల ఆమె మండిప‌డ్డారు. జ‌మ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కలెక్షన్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఆక్రమణ జరిగితే ఓ పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వం కూల్చేస్తోందని విమర్శించారు. హామీలను అమలు చేయలేకే హైడ్రా పేరుతో రేవంత్ హడావుడి చేస్తున్నారని అరుణ దుయ్య‌బ‌ట్టారు. వెంట‌నే కాంగ్రెస్ ప్ర‌భుత్వం స్పందించి ఇళ్లు కోల్పోయిన పేద‌ల‌కు న్యాయం చేయాల‌న్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :