Monday, 23 June 2025 02:40:33 PM
# ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్! # రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు: సీతక్క # రాత్రిపూట ఈ లక్షణాలున్నాయా? కాలేయ సమస్య కావచ్చు!

nagarkurnool : మాదక ద్రవ్యాలపై పటిష్ట నిఘా

జిల్లా కలెక్టర్‌ బాదావత్ సంతోష్

Date : 05 July 2024 02:16 AM Views : 182

Studio18 News - TELANGANA / : మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకాలపై నిఘా పెంచాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్‌ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి మాదకద్రవ్య నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో మత్తు పదార్థాల నివారణ, పండించడం, రవాణా పై తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.... గంజాయి ఉత్పత్తి, రవాణా వినియోగంపై అధికారులు పటిష్ఠ నిఘా పెట్టి నాగర్ కర్నూల్ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల నందు యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులలో మత్తు పదార్థాలపై, వాటి వల్ల కలుగు అనర్ధాలపై అవగాహనను కల్పించాలని సూచించారు. గంజాయి నిర్మూలనకై ప్రత్యేకంగా ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, నిర్వహిస్తూ అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ....గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి పోలీస్‌ యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రధాన ప్రాంతాలు, చెక్‌ పోస్టుల వద్ద 24 గంటలు నిఘా ఏర్పాటు చేశామన్నారు.. సమాజంలో మరియు విద్యా సంస్థల నందు, మత్తు పదార్థాలపై ఎటువంటి సమాచారం ఉన్న పోలీసు అధికారులకు సూచించాలని తెలిపారు.

Also Read : mancherial : నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :