Monday, 17 February 2025 03:48:43 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Date : 10 August 2024 03:14 PM Views : 62

Studio18 News - TELANGANA / : Minister Kishan Reddy : బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతో సంప్రదింపులు ఏమీ లేవని చెప్పారు. అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీడియాకే చెబుతానంటూ కిషన్ రెడ్డి అన్నారు. సామాజిక అసమానతల కారణంగా దళిత రిజర్వేషన్లు ఇచ్చారు. క్రిమీలేయర్ విషయంలో ఆలోచించమని చెప్పింది తప్ప ఆదేశించలేదు. ప్రస్తుతం ఏ పద్ధతి కొనసాగుతుందో అదే పద్ధతి కొనసాగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ఇళ్లను తీసుకోలేదు. నిన్నటి కేబినెట్ సమావేశంలో పట్టణ ప్రాంతంలో మూడు లక్షల ఇళ్లను తెలంగాణకు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఇళ్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇవ్వలేదు. గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపాదనలు రాగానే ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా ప్రధానిని కోరానని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నాం. అధ్యక్ష మార్పు అంశం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధం లేదని అన్నారు. జమ్ము-కాశ్మీర్ పర్యటనకు త్వరలో వెళ్తున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్లోలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :