Friday, 13 June 2025 03:55:27 AM
# ట్రైనీ డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లిన విమానం... ఘటన స్థలంలో అందినకాడికి దోపిడీలు! # కూలిన విమానంలో బ్రిటన్ జాతీయులు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ # ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభ‌మైంది: మంత్రి లోకేశ్‌ # కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు... బతికే అవకాశాలు స్వల్పం! # జర్నలిస్టు కృష్ణంరాజుకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు # కూలిపోయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ...? # అహ్మదాబాద్ విమాన దుర్ఘటన... కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడిన ప్రధాని మోదీ # ఘోర విమాన ప్రమాదం... గుజరాత్ సీఎంకు అమిత్ షా ఫోన్ # అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి # రోడ్డు పక్కన ఓ బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయిన రఘురామ... కూల్చివేతకు ఆదేశాలు! # పంజాబ్ నుంచి యూకేకి బుల్లెట్ బండి, ఫర్నిచర్.. రూ.4.5 లక్షలు ఖర్చుపెట్టిన ఫ్యామిలీ! # రైల్వేశాఖ కొత్త నిబంధన.. తత్కాల్ బుకింగ్‌కు ఇక ఆధార్ తప్పనిసరి # 'తల్లికి వందనం' నిధులు నేడే విడుదల.. 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి # బంగ్లాదేశ్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి # ఏఎంఏ అధ్యక్షుడిగా మన తెలుగు వైద్యుడు.. అమెరికా వైద్య చరిత్రలో నూతన అధ్యాయం! # ఫ్యాక్టరీస్ యాప్ ను ప్రారంభించిన ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి # కేజీబీవీ టాయిలెట్‌లో భారీ కొండచిలువ కలకలం # తెలిసి ఏ తప్పు చేయలేదు: సెల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రముఖ జానపద గాయని మంగ్లీ # విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించండి: అధికారులకు చంద్రబాబు ఆదేశాలు # యోగాంధ్రకు సర్వం సిద్ధం.. గిన్నిస్ రికార్డు కోసం భారీ సన్నాహాలు

KTR: ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే?: కేటీఆర్ ఆగ్రహం

Date : 05 August 2024 12:56 PM Views : 143

Studio18 News - TELANGANA / : ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై దాష్టీకం చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళ అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..! కొడుకు ముందే చిత్ర హింసలా?' అంటూ మండిపడ్డారు. రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ రాష్ట్రంలో అసలేం జరుగుతోందని ప్రశ్నించారు. మహిళలంటే ఇంత చిన్నచూపా..! ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు..! యథా రాజా తథా ప్రజా అన్నట్లు పాలన ఉందన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఆడబిడ్డల ఉసురు మంచిది కాదని హెచ్చరించారు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు... దౌర్జన్యాలు మాత్రం చేయకండని విజ్ఞప్తి చేశారు. షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని... బాధిత మహిళలకు న్యాయం చేయాలని సూచించారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :