Wednesday, 26 March 2025 04:45:07 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

Bridge Damage: 25 కోట్లు ఖర్చు చేసి 8 ఏళ్లపాటు కడితే.. ఏడాదికే కుంగుతున్న బ్రిడ్జి

Date : 29 August 2024 12:07 PM Views : 59

Studio18 News - TELANGANA / : ఎనిమిదేళ్ల పాటు సాగిన నిర్మాణ పనులు పూర్తయి బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.. మంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభం కూడా చేశారు. ఎలాగైతేనేం మన కష్టాలు తీరాయని జనం అనుకునేలోపే సదరు బ్రిడ్జి కుంగిపోవడం మొదలుపెట్టింది. వాహనంతో బ్రిడ్జి ఎక్కితే వైబ్రేషన్స్ ఏర్పడడంతో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. నాసిరకం పనుల కారణంగా ఏడాది కూడా పూర్తికాకముందే బ్రిడ్జి రిపేర్ కు వచ్చిందని మండిపడుతున్నారు. నిజాంసాగర్ మంజీరా నదిపై నిజాంసాగర్ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జి పరిస్థితి దారుణంగా మారింది. ఎప్పుడు కూలిపోతుందోనని జనం, వాహనదారులు భయపడుతున్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో 2016లో నాటి బీఆర్ఎస్ సర్కారు ఓ హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. పనులు కూడా మొదలయ్యాయి. అప్పటి నుంచి సాగి సాగి 2023 నాటికి పూర్తయ్యాయి. దాదాపు రూ.25 కోట్ల ప్రజాధనం ఈ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వం వెచ్చించింది. 2023 మార్చి 15న అప్పటి మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అయితే, ప్రారంభించి ఏడాది గడిచిందో లేదో బ్రిడ్జి బీటలు వారడం మొదలుపెట్టింది. వంతెనకు ఇరువైపులా రోడ్డు కుంగిపోయింది. దీంతో వంతెనపై ప్రయాణించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వంతెనకు పగుళ్లు ఏర్పడడంతో జనం పలుమార్లు ఫిర్యాదు చేయగా.. అధికారులు సదరు కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ తాత్కాలికంగా మరమ్మతులు చేసి మమ అనిపించాడు. ఈ బ్రిడ్జి పై నుంచి వెళుతుంటే వైబ్రేషన్స్ వస్తున్నాయని, కూలిపోతుందేమోనని భయం కలుగుతోందని వాహనదారులు వాపోతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :