Monday, 17 February 2025 05:02:14 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Union Budget-2024: చంద్రబాబు, నితీశ్ కుమార్ రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుంది: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్

Date : 23 July 2024 04:15 PM Views : 65

Studio18 News - TELANGANA / : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత బి.వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించలేదని తెలిపారు. "రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేటాయింపులు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి సంవత్సరం రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి హైదరాబాద్-బెంగళూరు కారిడార్ గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు చూసుకుంటే కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే తెలంగాణలో ఉంటుంది... మిగతాదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో ఉంటుంది. నిజంగా తెలంగాణకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించదలచుకుంటే హైదరాబాద్-నాగపూర్ కారిడార్ ను ప్రకటించాలి. దానివల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించారు. ఇప్పటికే చాలా కేటాయింపులు చేశారు. మరింత సాయం అందిస్తామని కూడా చెబుతున్నారు... మంచిదే. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణలో గోదావరిపై, కృష్ణా నదిపై జాతీయ ప్రాజెక్టుల గురించి చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ నిర్మలా సీతారామన్ గారు ఒక్క ప్రస్తావన కూడా చేయకపోవడం దురదృష్టకరం. ఈ బడ్జెట్ లో చంద్రబాబు, నితీశ్ కుమార్ ల రాష్ట్రాలకే పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. లోక్ సభలో బీజేపీకి 8 మందిని, కాంగ్రెస్ కి 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఈ 16 మంది ఎంపీలు బడ్జెట్ చర్చలో పాల్గొని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, నవోదయ విద్యాలయాలు, జాతీయ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల కోసం పట్టుబట్టాలి. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు వాటన్నింటిని సాధించుకోవాలి" అని స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :