Sunday, 08 March 2026 10:52:13 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Union Budget-2024: చంద్రబాబు, నితీశ్ కుమార్ రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుంది: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్

Date : 23 July 2024 04:15 PM Views : 338

Studio18 News - TELANGANA / : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత బి.వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్చరించలేదని తెలిపారు. "రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేటాయింపులు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి సంవత్సరం రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారు. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి హైదరాబాద్-బెంగళూరు కారిడార్ గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు చూసుకుంటే కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే తెలంగాణలో ఉంటుంది... మిగతాదంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో ఉంటుంది. నిజంగా తెలంగాణకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించదలచుకుంటే హైదరాబాద్-నాగపూర్ కారిడార్ ను ప్రకటించాలి. దానివల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించారు. ఇప్పటికే చాలా కేటాయింపులు చేశారు. మరింత సాయం అందిస్తామని కూడా చెబుతున్నారు... మంచిదే. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణలో గోదావరిపై, కృష్ణా నదిపై జాతీయ ప్రాజెక్టుల గురించి చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ నిర్మలా సీతారామన్ గారు ఒక్క ప్రస్తావన కూడా చేయకపోవడం దురదృష్టకరం. ఈ బడ్జెట్ లో చంద్రబాబు, నితీశ్ కుమార్ ల రాష్ట్రాలకే పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. లోక్ సభలో బీజేపీకి 8 మందిని, కాంగ్రెస్ కి 8 మందిని తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఈ 16 మంది ఎంపీలు బడ్జెట్ చర్చలో పాల్గొని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, నవోదయ విద్యాలయాలు, జాతీయ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల కోసం పట్టుబట్టాలి. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు వాటన్నింటిని సాధించుకోవాలి" అని స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :