Friday, 14 February 2025 08:29:54 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Telangana: రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీల ధర్నా!

Date : 25 July 2024 02:37 PM Views : 58

Studio18 News - TELANGANA / : బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు చేయడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ... విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేవలం ఏపీకి మాత్రమే అమలు చేసేలా బడ్జెట్‌లో హామీలు, కేటాయింపులు ఉన్నాయన్నారు. తెలంగాణలోని పాత తొమ్మిది జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల కింద నిధులు ఇస్తామని చెప్పి దాని గురించి బడ్జెట్‌లో ఏమీ మాట్లాడలేదన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీతో బీఆర్ఎస్ రాజీపడిందని విమర్శించారు. తెలంగాణకు న్యాయం జరిగే వరకు పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారన్నారు. కేంద్రమంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు. విభజన చట్టం 2014లో ఉంటే నాటి నుంచి లేని కేటాయింపులు ఈసారి బడ్జెట్‌లోనే ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ప్రధాని కుర్చీని కాపాడుకోవడానికే నితీశ్‌కు చెందిన బీహార్, చంద్రబాబుకు చెందిన ఏపీ రాష్ట్రాలకు న్యాయం చేశారని విమర్శించారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :