Sunday, 25 January 2026 06:03:06 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఆయనొస్తానంటే అడ్డుకుంటున్నదెవరు? బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ విషయంలో తీవ్ర గందరగోళం

Date : 24 August 2024 10:43 AM Views : 348

Studio18 News - TELANGANA / : Gossip Garage : తెలంగాణ బీజేపీలో తలోదారి అయిపోయింది. మొన్నటి వరకు స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా నడిచింది వ్యవహారం. ఇప్పుడు ఇంచార్జ్ వర్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్లుగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ విషయంలో పార్టీలో గందరగోళం కొనసాగుతోంది. తానే తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దాన్ని ఖండించారు. అయితే కిషన్ రెడ్డి మాటలను లెక్కచేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు అభయ్ పాటిల్. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా తరుణ్‌చుగ్‌ వ్యవహరించారు. ఆయనను జమ్మూకశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్‌కే పరిమితం చేయడంతో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. అధికారికంగా ఈ పదవిని ఎవరికి ఇచ్చినట్టుగా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించలేదు. కానీ జాతీయ నాయకత్వం మౌఖిక ఆదేశాలతో అభయ్ పాటిల్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ గా తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నారు. ఆగస్ట్ 17న ఢిల్లీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‌లో తెలంగాణ ఇంచార్జ్‌గా పాల్గొనట్టు అభయ్ పాటిల్ ట్వీట్ చేశారు. అదప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా జాతీయ నాయకత్వం ఎవరినీ అధికారికంగా ప్రకటించలేదంటూ స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇంతటితో అయిపోయిందనుకున్న అంశం పార్టీలో మరోసారి కొత్త చర్చకు దారితీసింది. అభయ్ పాటిల్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇక్కడి నేతలకు ఇష్టం లేదంట. అందుకే ఆయనను తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ గా రావడాన్ని అడ్డుకుంటున్నారంట. అయితే దీనికి కారణాలు లేకపోలేదు అంటున్నారు పార్టీ నేతలు. అభయ్ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల ఇంచార్జ్‌గా తెలంగాణలో పనిచేశారు. ఆయనకు ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది. పని చేయకపోతే ఎంతటి లీడర్ నైనా పదిమందిలోనే నిలదీసి అడుగుతారంట. నేతలకు అప్పగించిన పనిని వందశాతం పూర్తి చేయాలని పట్టుబడుతారట. ఒకరకంగా చెప్పాలంటే అభయ్ పాటిల్‌కు పని రాక్షసుడు అని పార్టీలో పేరుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు సాధించినప్పటికీ… గెలుస్తామనుకున్న భువనగిరి, జహీరాబాద్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఓడిపోయిన తీరుపై ఆయన స్థానిక సీనియర్ నేతలను సమావేశంలోనే నిలదీశారంట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ కీలక నేతను తన నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయని కడిగిపారేసారంట. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను కూడా పని విషయంలో పరుగులు పెట్టిస్తున్నాడంట. మాటలు చెప్పడం కాదు సాక్ష్యాలు, ఆధారాలు చూపించాలని అడిగేవారంట. ఇలాంటి వ్యక్తి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కొందరు నేతలు… ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారనే టాక్ బిజేపీలో నడుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే ఎవరు ఏమనుకున్నా జాతీయ నాయకత్వం అప్పగించిన పనిని తుచా తప్పకుండా చేస్తానని అభయ్ పాటిల్ అంటున్నారట. ఢిల్లీలో సమావేశంలో పాల్గొనడమే కాకుండా 21న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ బీజేపీ సభ్యత్వ మహోత్సవ్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆయనను డయాస్ మీదకు ఆహ్వానిస్తున్న సమయంలో పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరించిన అభయ్ పాటిల్ అని సంభోదించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అని ఎక్కడా పిలవలేదు. ఈ మాటలకు ఆయన కాస్త హర్ట్ అయినట్టే ఉన్నారట. ఏకంగా అదే వేదికపై ఎవరికి నచ్చినా నచ్చక పోయినా తాను హైకమాండ్ చెప్పిన పనిచేస్తానని ప్రకటించారట. దీంతో పార్టీలో ఏం జరుగుతుందని అక్కడికి వచ్చిన నేతలు మధ్య గుసగుసలు వినిపించాయి. ఇప్పటికే రాష్ట్ర నేతల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతున్న కమలదళానికి… ఇప్పుడు ఇంఛార్జీతోనూ గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్‌లను అన్నింటిని అధిగమించి పార్టీని కాబోయే కొత్త అధ్యక్షుడు, ఇంఛార్జీలు ఎలా గాడిన పెడతారో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :