Sunday, 08 March 2026 09:57:24 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Revanth Reddy: రెండు కీలక పనులపై ఈ రాత్రికి ఢిల్లీకి వెళ్తున్న రేవంత్

Date : 15 August 2024 04:24 PM Views : 461

Studio18 News - TELANGANA / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణకొరియా దేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. తాజాగా ఆయన మరో పర్యటనకు వెళ్తున్నారు. ఈ రాత్రి ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. హస్తినలో రేపు ఆయన ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం పార్టీ హైకమాండ్ తో సమావేశమవుతారు. టీపీసీసీ నూతన చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలతో చర్చిస్తారు. దీంతోపాటు వరంగల్ లో జరగనున్న రైతు కృతజ్ఞత సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే.... కేబినెట్ లో కొందరి శాఖలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈసారి మైనార్టీలకు స్థానం కల్పించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో స్థానంపై పలువురు సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మార్గాల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :