Friday, 14 February 2025 08:01:25 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

విద్యార్థి అనిరుధ్ కుటుంబ సభ్యులకు 50 వేల సాయం చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు

Date : 12 August 2024 05:51 PM Views : 52

Studio18 News - TELANGANA / : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్‌ క్యాంపులోని గురుకుల పాఠశాలలోఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై అనిరుధ్ అనే విద్యార్థి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో అనిరుధ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్.. వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎనిమిది నెలల్లో గురుకులాల్లో 36 మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. గురుకుల పాఠశాలలో ఆలనా పాలనా చూసుకునే వారు కరవయ్యారని చెప్పారు. రాజకీయాలు అవసరంలేదని, బాధిత 36 కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వవానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. సుమారు 500 మంది ఆసుపత్రుల పాలయ్యారని, ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని కేటీఆర్ చెప్పారు. అన్ని పాఠశాలల ఆవరణలు వెంటనే శుభ్రపరచాలని, ప్రభుత్వమే తల్లిదండ్రిలాగా విద్యార్థుల బాగోగుల బాధ్యతలను తీసుకోవాలని అన్నారు. కాగా, అనిరుధ్ పాముకాటుకు గురై మృతి చెందినట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :