Monday, 23 June 2025 03:48:17 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల్లో ట్విస్ట్.. మంత్రి ఫిర్యాదుతోనే రంగంలోకి హైడ్రా బృందం!

Date : 24 August 2024 03:37 PM Views : 138

Studio18 News - TELANGANA / : N Convention Demolished : హీరో అక్కినేని నాగార్జునకు హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) షాకిచ్చింది. ఆయ‌న‌కు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసింది. మాదాపూర్‌లో భారీ బందోబ‌స్తు మ‌ధ్య తెల్ల‌వారుజాము నుంచి కూల్చివేతను అధికారులు చేప‌ట్టారు. తుమ్మిడి చెరువును ఆక్ర‌మించి ఈ నిర్మాణం చేప‌ట్టార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దాదాపు మూడున్న‌ర ఎక‌రాలు క‌బ్జా చేసి క‌న్వెన్ష‌న్‌ను నిర్మించార‌ని గతంలోనే అధికారుల‌కు ఫిర్యాదులు వ‌చ్చాయి. అయితే, ఇటీవల స్వయంగా ఓ మంత్రి ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై మంత్రి కోటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకు ఈనెల 21న లేఖ రాశారు. గూగుల్ మ్యాప్, ఎఫ్టీఎల్ ఆధారంగా ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించుకొని నిర్మాణం చేసినట్లు మంత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి ఫిర్యాదు మేరకు హైడ్రా బృందం రంగంలోకిదిగి విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదిలకు తెప్పించుకుంది. హైడ్రా విచారణలో చెరువును ఆక్రమించుకొని నిర్మాణం జరిగిందని తేల్చింది. దీంతో శనివారం తెల్లవారు జామున కూల్చివేతలను హైడ్రా బృందం ప్రారంభించింది. మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. వ్యవస్థలు తమ పనితాము చేస్తాయని అన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరిచేస్తున్నామని జూపల్లి కృష్ణారావు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :