Wednesday, 26 March 2025 04:47:16 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

మున్నేరుకు మళ్లీ వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలు

Date : 08 September 2024 11:16 AM Views : 121

Studio18 News - TELANGANA / : Khammam Flood : మున్నేరు వరద సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. మున్నేరు వరద ఉధృతి ఖమ్మంలో బీభత్సం చేసింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. మున్నేరు వరద ఉధృతిలో సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇప్పుడిప్పుడే దానినుంచి తేరుకుంటున్న వదర బాధితులను మరోసారి మున్నేరు వరద భయాందోళకు గురిచేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరులో వరదనీరు పోటెత్తింది. దీంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి ప్రవాహం 16 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా మున్నేరులోకి పెద్దెత్తున వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి ప్రవాహం 16 అడుగులకు చేరడంతో అధికారులు ముంపు ప్రాంతాల వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మున్నేరు వరద నేపథ్యంలో ఖమ్మం నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. బాదితులతో మాట్లాడారు. అనంతరం అధికారులతో మున్నేరు వరద పరిస్థితిపై సమీక్షించారు. ముందస్తు సహాయక చర్యలపైనా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అదేవిధంగా భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఇవాళ ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. మున్నేరులో వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతోపాటు.. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. అనుకోకుండా వచ్చిన మున్నేరు వరద ఉధృతికి స్వర్వం కోల్పోయామని, రెండురోజుల క్రితం వరద ఉధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుతున్నామని, ఈ సమయంలో మళ్లీ మున్నేరుకు వరద పోట్లెత్తడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :