Saturday, 26 April 2025 07:14:52 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఖర్గేనూ వదిలిపెట్టబోమని వార్నింగ్

Date : 21 August 2024 02:58 PM Views : 132

Studio18 News - TELANGANA / : Manda krishna madiga: అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతున్న హర్షకుమార్‌ తన రాజకీయ అవసరాల కోసమే కులాన్ని వాడుకున్నారని, జాతి కోసం చేసిందేమి లేదని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మోకాళ్లు అడ్డిందే హర్షకుమార్.. అలాంటి వ్యక్తి టీడీపీలో ఎందుకు చేరారు? హర్షకుమార్ సమాధానం చెప్పాలి. వర్గీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారిమీద నేను మాట్లాడను. పార్లమెంటులో బిల్లు అనుకూలంగా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద నెపం వేసిండు. ఇవాళ రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పగానే మళ్ళీ పార్లమెంట్ ప్రస్తావన తీసుకొస్తున్నారని మందకృష్ణ అన్నారు. మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని.. విప్లవోద్యమం పేరుతో దళితులను వాడుకున్నారని మందకృష్ణ విమర్శించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా 90% మంది మాలలు ఎమ్మార్పీఎస్‌కు మద్ధతు ఇచ్చారని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తిగానే ఉంటానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు చెబుతానన్నారు. ఖర్గేను వదిలిపెట్టం.. నిలదీస్తాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను వదిలిపెట్టబోమని, గట్టిగా నిలదీస్తామని మందకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణకు అనుకూలంగా ఉంటే ఖర్గేకు బాధ ఎందుకని ప్రశ్నించారు. ఎంతో కొంతో రేవంత్ రెడ్డిని నమ్ముతాను, ఖర్గేను నమ్మను అని వ్యాఖ్యానించారు. వర్గీకరణకు మల్లిఖార్జున ఖర్గే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వాగతించారని, ఖర్గే ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు.ఖర్గే తమ కులానికే నాయకుడని, దళితుందరికీ కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :