Friday, 14 November 2025 02:38:08 PM
# Jubilee Hills Bypoll: రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్.. మధ్యాహ్నానికే ఫలితం.. 10 రౌండ్లలో లెక్కింపు # Nara Lokesh: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ ఇదే.. ఏపీకి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి # Naresh: పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం # Umar Mohammad: బాంబు దాడికి ముందు ఓల్డ్ ఢిల్లీ మసీదుకు వెళ్లిన ఉమర్.. 10 నిమిషాలు అక్కడే! # Nitish Kumar Reddy: నితీశ్ రెడ్డి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడడం లేదు... ఎందుకంటే...! # Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి: కాజోల్ సంచలన వ్యాఖ్యలు # Sujal Ram Samudra: పెళ్లి వేదికపైనే వరుడిపై కత్తితో దాడి.. డ్రోన్‌ కెమెరాతో ఛేజింగ్! # Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు # Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ # Diabetes in India: భారత్‌ను వణికిస్తున్న డయాబెటిస్.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు # Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే! # TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న ఏఐ చాట్‌బాట్‌! # Umar Un Nabi: ఎర్రకోట పేలుడు కేసులో టర్కీ లింక్.. 'ఉకాసా' కోడ్‌నేమ్‌తో హ్యాండ్లర్! # Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత # Marco Rubio: ఢిల్లీ పేలుడు దర్యాప్తు.. భారత ఏజెన్సీలపై అమెరికా ప్రశంసలు # Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు # China Bridge Collapse: చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి.. వీడియో ఇదిగో! # Bala Bharosa Scheme: తెలంగాణలో 'బాల భరోసా'.. చిన్నారుల కోసం సరికొత్త పథకం # Donald Trump: అమెరికాలో ముగిసిన సుదీర్ఘ షట్‌డౌన్.. ట్రంప్‌దే పైచేయి # Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్.. పొరపాటున లీక్ చేసిన స్టార్ స్పిన్నర్

మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఖర్గేనూ వదిలిపెట్టబోమని వార్నింగ్

Date : 21 August 2024 02:58 PM Views : 290

Studio18 News - TELANGANA / : Manda krishna madiga: అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతున్న హర్షకుమార్‌ తన రాజకీయ అవసరాల కోసమే కులాన్ని వాడుకున్నారని, జాతి కోసం చేసిందేమి లేదని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మోకాళ్లు అడ్డిందే హర్షకుమార్.. అలాంటి వ్యక్తి టీడీపీలో ఎందుకు చేరారు? హర్షకుమార్ సమాధానం చెప్పాలి. వర్గీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారిమీద నేను మాట్లాడను. పార్లమెంటులో బిల్లు అనుకూలంగా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద నెపం వేసిండు. ఇవాళ రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పగానే మళ్ళీ పార్లమెంట్ ప్రస్తావన తీసుకొస్తున్నారని మందకృష్ణ అన్నారు. మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని.. విప్లవోద్యమం పేరుతో దళితులను వాడుకున్నారని మందకృష్ణ విమర్శించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా 90% మంది మాలలు ఎమ్మార్పీఎస్‌కు మద్ధతు ఇచ్చారని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తిగానే ఉంటానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు చెబుతానన్నారు. ఖర్గేను వదిలిపెట్టం.. నిలదీస్తాం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను వదిలిపెట్టబోమని, గట్టిగా నిలదీస్తామని మందకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణకు అనుకూలంగా ఉంటే ఖర్గేకు బాధ ఎందుకని ప్రశ్నించారు. ఎంతో కొంతో రేవంత్ రెడ్డిని నమ్ముతాను, ఖర్గేను నమ్మను అని వ్యాఖ్యానించారు. వర్గీకరణకు మల్లిఖార్జున ఖర్గే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వాగతించారని, ఖర్గే ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు.ఖర్గే తమ కులానికే నాయకుడని, దళితుందరికీ కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :