Monday, 08 December 2025 04:32:25 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

KTR: మన వద్ద రీకాల్ సిస్టం లేదు... నాలుగేళ్లు కాంగ్రెస్‌ను భరించాల్సిందే: కేటీఆర్

Date : 31 July 2024 01:10 PM Views : 297

Studio18 News - TELANGANA / : మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని... ప్రజలకు ఇక వేరే మార్గం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బడ్జెట్‌పై తమను ప్రతిపక్షం అభినందిస్తుందని భావించానని భట్టివిక్రమార్క అన్నారని... కానీ ఏం చూసి అభినందించాలో చెప్పాలన్నారు. నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్‌లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో తొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్షా... అభిశంసించాలి. మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నాలుగేళ్లు భరించాల్సిందే అన్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అన్నారు తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా? అని ఉద్యమం సమయంలో చాలామంది అన్నారని, పదేళ్ల క్రితం నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రం చీకట్లతో నిండిపోతుందన్నారని గుర్తు చేశారు. పదేళ్లలో తెలంగాణ సంపద పెరిగిందని గతంలో చెప్పిన భట్టివిక్రమార్క, అధికారంలోకి వచ్చాక మాత్రం మాట మారుస్తున్నారన్నారు. రెవెన్యూ మిగులుపై కేటీఆర్ లెక్కలు 2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.369 కోట్ల మిగులుతో తమకు రాష్ట్రాన్ని అప్పగించిందన్నారు. నాడు రెవెన్యూ మిగులు అదే అన్నారు. కానీ 2022-23 నాటికి రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లుగా ఉందన్నారు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ.209 కోట్లు అన్నారు. రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ విమర్శిస్తోందని, కానీ ఆరోజు మిగులు ఎంతో చూడాలన్నారు. వేతనాలు తెచ్చేందుకు అప్పులు తెచ్చామని చెప్పిన ఆర్థికమంత్రి... బడ్జెట్‌లో మాత్రం మిగలు ఉందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని 33 జిల్లాలు ముందున్నాయన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :