Saturday, 26 April 2025 07:48:20 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Palla Rajeshwar Reddy: ధరణి పోర్టల్ పేరును నాలుగు గోడల మధ్య పెట్టలేదు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Date : 02 August 2024 04:36 PM Views : 157

Studio18 News - TELANGANA / : నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ పేరును నాలుగు గోడ‌ల మ‌ధ్య పెట్ట‌లేద‌ని... అనేక రివ్యూలు చేసి అంద‌రి స‌మ‌క్షంలో నిర్ణ‌యించిన పేరే ధ‌ర‌ణి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో 'భూమి హక్కులు, సంస్కరణలు' అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ... రెవెన్యూ చ‌ట్టాల‌ను మార్చేందుకు నిర్వ‌హించిన ప‌లు స‌మావేశాల్లో పొంగులేటి కూడా నాటి సీఎం కేసీఆర్‌తో ఉన్నారన్నారు. పొంగులేటికి ఇప్పుడు మంత్రిగా అవకాశం వచ్చిందని, మిగతా మంత్రులు తిట్టినట్లే ఆయన కూడా కేసీఆర్ పట్ల కొన్ని అనరాని మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది వారి విజ్ఞ‌త‌కే వదిలేస్తున్నానన్నారు. కేసీఆర్ పట్ల పొంగులేటి అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నట్టు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ధరణి చట్టం వల్ల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలిగాయన్నారు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా భూహక్కులు కల్పించామన్నారు. ధరణి ద్వారా తెచ్చిన భూసంస్కరణలు రైతులకు ఎంతో మేలు చేశాయన్నారు. ధరణి పేరు బాగా లేదని చెబుతూ భూమాత లేదా మరో పేరు మార్చుదామని అనుకుంటున్నారని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ధరణి అనే పేరు రాగానే వారికి కేసీఆర్ కనిపిస్తున్నారని, అందుకే మార్చుతున్నారన్నారు. మా హయాంలో ఆత్మహత్యలు తగ్గాయి బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలో, రాష్ట్రాలలో ఆత్మహత్యలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుందని, అందులో వివరాలు ఉంటాయని, వాటిని చూసుకోవచ్చునన్నారు. అప్పుడు ఆత్మహత్యలు జరిగాయని పదేపదే అనడం సరికాదన్నారు. 2014లో అధికంగా ఉన్న ఆత్మహత్యలను కేసీఆర్ ప్రభుత్వం తగ్గించిందన్నారు. భూమి ఎవరికి ఎలా ఉందో ఇటీవల ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశ పెట్టిన బుక్‌లో ఉందన్నారు. సీలింగ్ చట్టం ప్రకారం 25 నుంచి 52 ఎకరాల వరకే ఉండాలన్నారు. 25 నుంచి 52 ఎకరాల మధ్య 9,000 మందికి భూములు ఉన్నాయని, అవి చట్టం ప్రకారమే ఉన్నాయని సోషియో ఎకనమిక్ ఔట్ లుక్ బుక్‌లో ఉపముఖ్యమంత్రి పేర్కొన్నట్లు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :