Wednesday, 12 November 2025 03:54:18 AM
# Shaheen: మా అమ్మాయి ఉగ్రవాదా?... నమ్మలేకపోతున్నాను!: డాక్టర్ షాహీన్ తండ్రి ఆవేదన # Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు # Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ # Bharati Dixit: ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు # Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు # Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం # Chhattisgarh Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి # Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు # Bihar Elections: బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం... ముక్తకంఠంతో చెబుతున్న ఎగ్జిట్ పోల్స్‌! # Amit Shah: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు # India Russia Relations: భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు # Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా? # Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు # Delhi blast: పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! # Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు # HR Department: హెచ్‌ఆర్ పొరపాటు.. సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్! # Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం # Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి # Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌! # Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ గాయంపై సంచలన విషయాలు.. అప్పుడు ఆక్సిజన్ 50కి పడిపోయింది!

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు.. బదిలీ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Date : 02 September 2024 03:06 PM Views : 269

Studio18 News - TELANGANA / : Vote Note Case : ఓటుకు నోటు కేసులో విచారణ బదిలీ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు వాయిదా వేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. న్యాయవాదులు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా పోలీసు అధికారులను బెదిరించేలా వ్యవహరించారని మరోసారి న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం హోం మంత్రి హోదా కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నదని, కేసు ముందుకు తీసుకెళ్ళాల్సిన అధికారులు ప్రతిరోజు ఆయనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఒకవేళ మరోచోటుకు విచారణ మార్చితే కూడా.. అధికారులు ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టుకు వెళతారు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అప్పుడు జ్యురిస్డిక్షన్ మారుతుందని న్యాయవాదులు తెలిపారు. విచారించే కోర్టు మారినా పరిధి మారదు, విషయం మారదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇప్పటికే 25 మంది సాక్షులు నుంచి అన్ని వివరాలు నమోదు అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత శుక్రవారం కోర్టుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పడంతో పాటు.. న్యాయ వ్యవస్థ పై తనకు ఎంత గౌరవం ఉందో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో కోర్టులు, న్యాయవ్యవస్థ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయాలతో ఐఏ దాఖలు చేశామని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పూర్తి బాధ్యత ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదుల, న్యాయమూర్తుల ఫోటోలు పెట్టి ఇష్టారీతిలో సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ వివరాలు అన్ని ఐఏలో పొడుపరిచినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషనర్ దాఖలు చేసిన ఐఏ పై సమాధానం చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ల ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :