Wednesday, 19 March 2025 05:29:42 PM
# 'క్రష్డ్ ' (అమెజాన్ మినీ ప్లేయర్) సిరీస్ రివ్యూ! # Parag Shah: మన దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే... అత్యంత పేద ఎమ్మెల్యే.... ఎవరో తెలుసా...! # KTR: ప్రగతి రథానికి పంక్చర్ వేశారు... తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్ # Momo Factory: పంజాబ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. మోమోస్ త‌యారీ కేంద్రంలో కుక్క మాంసం...! # Bandi Sanjay: ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉంది: బండి సంజయ్ # Realme: కొత్త ఫోన్ ను మార్కెట్లోకి వదిలిన రియల్ మీ... బ్యాంక్ ఆఫర్లతో రూ.2 వేల డిస్కౌంట్! # Vodafone Idea 5G : Vi యూజర్లకు గుడ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా 5G సేవలు మీకోసం.. కొత్త ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఇవే..! # Infinix Note 50X 5G : కొత్త ఫోన్ కావాలా? ఈ నెల 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవేనట..! # Aadhaar Update : మీకు కొత్తగా పెళ్లి అయిందా? మీ ఆధార్ పేరు, అడ్రస్ మార్చుకోలేదా? ఆన్‌లైన్‌లో ఇలా అప్‌డేట్ చేసుకోండి.. సింపుల్ ప్రాసెస్ మీకోసం.! # JioCinema Subscription : జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఈ రీఛార్జ్ ప్లాన్లలో ఇకపై ‘జియోసినిమా’ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.. చెక్ చేసుకోండి! # Pawan Kalyan: టీడీపీని ఈయనే గెలిపించాడంట... నాశనానికి ముందు ఇలాంటి గర్వమే వస్తుంది: కేఏ పాల్ # Election Commission of India: ఆధార్ తో ఓటరు కార్డు అనుసంధానానికి మొగ్గు చూపిన ఎన్నికల సంఘం # Rahul Gandhi: మహా కుంభమేళాపై మోదీ మాటలకు నేను మద్దతిస్తాను... కానీ!: రాహుల్ గాంధీ # Vijay Sai Reddy: మరోసారి విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు # YS Sharmila: అప్పుడు జగన్ చేసిన తప్పే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల # Andhra Pradesh: తక్కువ ద్రవ్యోల్బణం నమోదవుతున్న రాష్ట్రాలలో నాలుగో స్థానంలో ఏపీ # Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు # Nidhi Agarwal: బెట్టింగ్ యాప్ వ్యవహారం... నిధి అగర్వాల్ పైనా కేసు తప్పదా...? # Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్... రేపు మోదీ, బిల్ గేట్స్ లను కలవనున్న ఏపీ సీఎం # New Delhi: అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు.. బదిలీ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Date : 02 September 2024 03:06 PM Views : 64

Studio18 News - TELANGANA / : Vote Note Case : ఓటుకు నోటు కేసులో విచారణ బదిలీ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు వాయిదా వేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. న్యాయవాదులు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా పోలీసు అధికారులను బెదిరించేలా వ్యవహరించారని మరోసారి న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం హోం మంత్రి హోదా కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నదని, కేసు ముందుకు తీసుకెళ్ళాల్సిన అధికారులు ప్రతిరోజు ఆయనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఒకవేళ మరోచోటుకు విచారణ మార్చితే కూడా.. అధికారులు ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టుకు వెళతారు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అప్పుడు జ్యురిస్డిక్షన్ మారుతుందని న్యాయవాదులు తెలిపారు. విచారించే కోర్టు మారినా పరిధి మారదు, విషయం మారదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇప్పటికే 25 మంది సాక్షులు నుంచి అన్ని వివరాలు నమోదు అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత శుక్రవారం కోర్టుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పడంతో పాటు.. న్యాయ వ్యవస్థ పై తనకు ఎంత గౌరవం ఉందో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో కోర్టులు, న్యాయవ్యవస్థ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయాలతో ఐఏ దాఖలు చేశామని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పూర్తి బాధ్యత ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదుల, న్యాయమూర్తుల ఫోటోలు పెట్టి ఇష్టారీతిలో సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ వివరాలు అన్ని ఐఏలో పొడుపరిచినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషనర్ దాఖలు చేసిన ఐఏ పై సమాధానం చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ల ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :