Friday, 14 February 2025 08:18:21 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Mancherial : ఆసుపత్రిలో విద్యుత్ సమస్య పై స్పందించిన ఎంఎల్ఏ

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవం

Date : 07 July 2024 12:52 AM Views : 152

Studio18 News - TELANGANA / : మంచిర్యాల పట్టణంలోని గోదావరి ప్రాంగణంలో ఉన్న మాత శిశు ఆసుపత్రిని ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో సమీక్షించి , ఆసుపత్రికి వచ్చిన రోగులు , బాలింతల తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు..రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడటంతో రోగులు, గర్భిణులు, బాలింతలు, శిశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఈ క్రమంలో వర్షానికి వరద నీరు ఆసుపత్రిలో చేరాయని పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో సమాచారం తెలుసుకున్న ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు స్పందించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆసుపత్రిలో వార్డులలో తిరిగి పలువురు రోగులతో సమస్యలపై అర తీశారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ .. రెండు రోజుల క్రితం కరెంట్ కేబుల్ సాంకేతిక కారణాల వల్ల కాలిపోవడంతో మరొక కేబుల్ ను అమర్చే సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడిందని తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేసి అధికారులు విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారని అంతరాయం సమయంలో బాలింతలు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు తెలిపారు .. జనరేటర్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం తో ఈ సమస్య తలెత్తి శిశువులు బాలింతలు అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. అధికారులతో చర్చించి జనరేటర్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.. మాతా శిశు ఆసుపత్రి పట్టణంలోనీ ఐబీ వద్ద నిర్మించేందుకు వైద్య ఆరోగ్య శాఖ నుండి అనుమతులు లభించాయని త్వరలోనే సర్క్యులర్ జారీ అవుతుందని తెలిపారు. విద్యుత్ వైర్లు కాలిపోవడం ప్రమాద వశాత్తూ జరిగిందా లేక గిట్టని వారు చేసారా అని కోణం లో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని, అలాగే సంబంధిత టెక్నిషియన్లు విధుల్లో. నిర్లక్ష్యం వహించిన వారి పైన విచారణ జరిపి బాధ్యులైన వారిని తగు చర్యలు చేపడతామని , మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అధికారులను హెచ్చరించారు...

Also Read : RajannaSircilla : బాబూ జగ్జీవ‌న్ రాం జీవితం స్ఫూర్తిదాయ‌కం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :