Wednesday, 30 April 2025 10:01:24 AM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే 45 పైసలే ఇస్తోంది... తొలి నిరసన ఇదే: రేవంత్ రెడ్డి

Date : 24 July 2024 05:51 PM Views : 105

Studio18 News - TELANGANA / : తెలంగాణ పన్నుల రూపంలో కేంద్రానికి ఒక రూపాయి చెల్లిస్తే మనకు కనీసం 45 పైసలు కూడా తిరిగి రావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో జరిగిన వివక్షను నిరసిస్తూ ఈ నెల 27న నీతి అయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ అభివృద్ధి జరగాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టంలో పేర్కొన్నారన్నారు. ఈ పదేళ్ల కాలంలో కేంద్రానికి దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల నుంచి రూ.22 లక్షల కోట్లకు పైగా వెళితే కేవలం రూ.6 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. అదే ఉత్తర ప్రదేశ్ కేవలం రూ.3.41 లక్షల కోట్లు చెల్లిస్తే దక్షిణాదికి చెందిన ఐదు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇచ్చిందని ఆరోపించారు. బీహార్ నుంచి ఒక రూపాయి వెళితే రూ.7 తిరిగి ఇస్తోందన్నారు. మోదీ ఏమైనా గుజరాత్‌లోని తన ఎస్టేట్‌లు అమ్మి ఇస్తున్నాడా? అని ధ్వజమెత్తారు. ఫెడరల్ స్ఫూర్తితో మోదీని కలిశా... తలొంచడం కాదు ఫెడరల్ స్ఫూర్తితో ప్రధాని మోదీని పలుమార్లు కలిసి నిధులు కోరానన్నారు. పెద్దన్న అని పిలిచి... ఆ పాత్ర పోషించండని తాను మోదీని కోరానన్నారు. పెద్దన్న అని పిలిస్తే మోదీ తనకు ఇచ్చేదేమీ లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఒక మెట్టు దిగి ప్రధాని మోదీతో సఖ్యతగా ఉన్నానన్నారు. తనకు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అవకాశం ఇస్తే సీఎం అయ్యానన్నారు. కానీ పెద్దన్న అన్నంత మాత్రాన తనకు వచ్చిందేమీ లేదన్నారు. తెలంగాణ కోసం మాత్రమే కేంద్రంతో బాగుండే ప్రయత్నం చేశామన్నారు. తమది ప్రజాస్వామ్య స్ఫూర్తితో పని చేసే ఆలోచన తప్ప... ఎవరి ముందో తలవంచడం కాదన్నారు. తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదని... కక్ష అన్నారు. తెలంగాణ కోసం తామెన్నో త్యాగాలు చేశామని కొంతమంది చెబుతున్నారని, కానీ ఏ పదవి లేని రోజున వారికి సోనియాగాంధీ కేంద్రమంత్రి పదవి ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఈరోజు చర్చను తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నామన్నారు. బడ్జెట్‌లో మనకు జరిగిన అన్యాయంపై తొలి నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు. సీఎంగా నీతి అయోగ్ సమావేశానికి వెళ్లడం లేదన్నారు. మన బహిష్కరణకు సభ మొత్తం ఆమోదించాలని కోరుతున్నానన్నారు. బడ్జెట్‌లో మన హక్కులకు భంగం కలిగాయని, వివిధ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని, ప్రాజెక్టులకు నిధులు రాలేదన్నారు. అందుకే మనం ప్రజాస్వామ్య స్ఫూర్తితో నిరసన తెలుపుతున్నామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :