Thursday, 27 March 2025 01:30:45 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

Raksha Bandhan 2024 : ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా నేతలు.. వీడియోలు వైరల్

Date : 19 August 2024 02:46 PM Views : 68

Studio18 News - TELANGANA / : Raksha Bandhan 2024 : రాఖీ పౌర్ణమి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడుతూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గతేడాది కూడా ప్రధాని ఇలాగే స్కూల్ విద్యార్థునులతో రాఖీ కట్టించుకున్న సంతగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బ్రహ్మకుమారీలు, టీడీపీ మహిళా నేతలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిశారు. చంద్రబాబుకు రాఖీ కట్టిన వారిలో టీడీపీ మహిళా నేతలు, మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా – అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అచంట సునీత, కంభంపాటి శిరీష సహా పలువురు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. సీఎం చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. స్వీటు తినిపించారు. అనంతరం పలువురు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. రాష్ట్రంలోని మహిళలందరికీ సీఎం రేవంత్ రెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో జరిగిన రాఖీ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి కేటీఆర్ కు రాఖీలు కట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :