Monday, 17 February 2025 03:17:43 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Seetharama project : సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

Date : 11 August 2024 02:46 PM Views : 102

Studio18 News - TELANGANA / : Seetharama project pump house : సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ల ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ 2 స్విచ్ ఆన్ చేసిన మంత్రులు.. ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం డెలివలి ఛానల్ వద్ద గోదారమ్మకు మంత్రులు ప్రణమిల్లారు. కమలాపురం పంప్ హౌస్ 3 ట్రయల్ రన్ ను మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే, ఈ నెల 15న సీతారామ ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని తుమ్మల అన్నారు. ఇందిరా సాగర్ భూభాగం ఆంధ్రాలో కలవడం, రాజీవ్ సాగర్ అటవీ ప్రాంతం సమస్యల వల్ల సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన జరిగింది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరితగతిన పూర్తి చేయాలని, కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలనన్నారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయి. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని తుమ్మల చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా చిరకాల కోరిక నెరవేరింది. సీతారామ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఇల్లందు మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :