Thursday, 22 May 2025 02:33:27 PM
# రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక # నిరుపేద పిల్లల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్న మోహన్ లాల్ # అరుణాచల్ ప్రదేశ్ లో పరీక్ష.. హర్యానా నుంచి ఆన్సర్లు.. హైటెక్ కాపీయింగ్ # 32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి? # పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు .. భారీ బందోబస్తు నడుమ కూల్చివేసిన హైడ్రా # సహనం కోల్పోయిన ట్రంప్.. నీకు తెలివి తక్కువ, గెటవుట్ అంటూ రిపోర్ట్‌పై చిందులు # : వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ .. మన ఊరు - మాటా మంతి

Seetharama project : సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

Date : 11 August 2024 02:46 PM Views : 168

Studio18 News - TELANGANA / : Seetharama project pump house : సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ల ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ 2 స్విచ్ ఆన్ చేసిన మంత్రులు.. ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం డెలివలి ఛానల్ వద్ద గోదారమ్మకు మంత్రులు ప్రణమిల్లారు. కమలాపురం పంప్ హౌస్ 3 ట్రయల్ రన్ ను మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే, ఈ నెల 15న సీతారామ ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని తుమ్మల అన్నారు. ఇందిరా సాగర్ భూభాగం ఆంధ్రాలో కలవడం, రాజీవ్ సాగర్ అటవీ ప్రాంతం సమస్యల వల్ల సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన జరిగింది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరితగతిన పూర్తి చేయాలని, కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలనన్నారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయి. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని తుమ్మల చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా చిరకాల కోరిక నెరవేరింది. సీతారామ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఇల్లందు మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :