Thursday, 27 March 2025 12:57:19 PM
# ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు # Sanjeev Goenka: గోయెంకా... పంత్ ను కూడా ఏకిపడేశాడా? # Nirmala Sitharaman: ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్ # Suman: చంద్రబాబు, పవన్ క‌ల్యాణ్‌ కాంబినేషన్ బాగుంది: నటుడు సుమన్

KTPS: కేటీపీఎస్‌లోని 8 కూలింగ్ టవర్లు కూల్చివేత...

Date : 05 August 2024 05:24 PM Views : 73

Studio18 News - TELANGANA / : నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారిగా విద్యుత్‌ను అందించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్లాంట్‌ను కూల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్ కు చెందిన 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్ 11న మెయింటెనెన్స్ ప్లాంట్‌ మూతబడింది. కూలింగ్ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో 2023 జనవరి 18 నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత ప్రక్రియ పనులు జరుగుతున్నాయి. ఈ టవర్ల కూల్చివేతకు జెన్‌కో ద్వారా టెండర్లను ఆహ్వానించారు. హెచ్ఆర్ కమర్షియల్‌కు కొన్ని నెలల క్రితం రూ.485 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు. పాత కేటీపీఎస్ ప్లాంట్‌లో 100, 120 మీటర్ల ఎత్తులో ఉన్న పలు కూలింగ్ టవర్లను గత ఫిబ్రవరిలో నేలమట్టం చేశారు. 1965-67 నుంచి 1978 వరకు దశలవారీగా నిర్మించిన ఏ, బీ, సీ పవర్ స్టేషన్లలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎనిమిది కూలింగ్ టవర్లను నిర్మించారు. ఈ టవర్ల కూల్చివేత ప్రక్రియను జైపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థ చేపట్టింది. ట్రాన్స్‌కోతో పాటు జిల్లా కలెక్టర్ అనుమతులు పొందిన తర్వాత కూల్చివేత చేపట్టారు. 30 మంది సిబ్బంది దాదాపు నెల రోజుల పాటు సన్నాహాలు చేశారు. మూడు దశల్లో కూల్చివేత కొనసాగింది. మొదట 'ఏ' స్టేషన్‌లోని 102 మీటర్ల ఎత్తుగల నాలుగు కూలింగ్ టవర్లను, ఆ తర్వాత 115 మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను రెండు దశల్లో నేలమట్టం చేశారు. వీటిని కూల్చేందుకు ఇంప్లోషన్ టెక్నిక్ ను ఉపయోగించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :