Friday, 14 February 2025 06:48:36 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు మృతి

Date : 11 August 2024 10:36 AM Views : 98

Studio18 News - TELANGANA / : Road Accident : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి కారు మితిమీరిన వేగంతో రావడమేనని తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు టిప్పర్ లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గంటలపాటు శ్రమించి గాయపడిన వారిని కారులో నుంచి బయటకు తీశారు. గాయపడిన వారిలో ముగ్గురు ఇంజనీర్స్ ఉన్నారు. గచ్చిబౌలి నుండి నార్సింగ్ మైహోమ్ అవతార్ మీదుగా ప్రయణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న సిరి, గౌతమ్, సుదీప్ లకు తీవ్ర గాయాలు కాగా.. టిప్పర్ లారీ డ్రైవర్ సతీష్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మంచిర్యాల నుంచి గోదావరిఖనికి బైక్ పై వెళ్తున్న వారిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆలిగడ్ కు చెందిన సత్తేందర్, దేవుకుమార్ అక్కడికక్కడే మరణించారు. మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్ లో వీరు పనిచేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :