Saturday, 22 March 2025 09:18:33 AM
# NPCI: ఇనాక్టివ్ ఫోన్ నెంబర్లకు యూపీఐ సేవల నిలిపివేత # Honey Trap: కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు # Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు # Rajitha Mother : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి తల్లి కన్నుమూత.. # తిరుమలలో చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికిచ్చిన 35 ఎకరాలు క్యాన్సిల్.. # Tirumala: నారా దేవాన్ష్​లా మీరూ టీటీడీ అన్నప్రసాదం ట్ర‌స్టుకు విరాళం ఇవ్వొచ్చు.. దేనికి ఎంత ఖర్చు అవుతుందంటే? # Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు.. సోషల్ మీడియాలో హెచ్చరించిన మెగాస్టార్.. # Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..! # IPL 2025: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే? # Telangana : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి.. # Chiranjeevi : పీఎం మోదీ ఆ రోజు నాతో ఏం మాట్లాడారంటే.. కన్నీళ్లు వచ్చాయంటూ.. చిరు వ్యాఖ్యలు వైరల్.. # పర్ఫార్మెన్స్, డిజైన్ రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని స్మార్ట్‌ప్రిక్స్ రిపోర్టు తెలిపింది. ఐక్యూ Z10 సిరీస్‌లో Pro, Z10x వేరియంట్ కూడా ఉంటుందని గతంలో # Telangana Assembly: సై అంటే సై.. అసెంబ్లీలో రగడ.. హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి.. # Gold Price: రాబోయే మూడు నెలల్లో బంగారం ధరలు ఎంతగా పెరుగుతాయో తెలుసా? # MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..! # Gold: బాబోయ్.. బంగారం రికార్డులే రికార్డులు.. ఆశ్చర్యపరుస్తున్న డబ్ల్యూజీసీ తాజా గణాంకాలు.. 2025 చివరి నాటికి.. # Tata Car Prices : కొత్త కారు కావాలా? ఏప్రిల్‌లో భారీగా పెరగనున్న టాటా PV, EV కార్ల ధరలు.. ఇప్పుడు కొంటేనే బెటర్..! # Mahesh Babu – Sitara : మహేష్ బాబుకే నేర్పిస్తున్న కూతురు సితార.. జెన్ జీ అంటే అట్లుంటది మరి.. వీడియో వైరల్.. # McDonald’s: గుడ్‌న్యూస్‌.. తెలంగాణ నుంచి ఇవి కొనేందుకు మెక్‌డొనాల్డ్స్‌ రెడీ.. ఇక మనవాళ్లకి లాభాలు.. # Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!

దామోదర రాజనర్సింహ, నేను కలిసి బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించాం: జగ్గారెడ్డి

Date : 08 August 2024 03:24 PM Views : 126

Studio18 News - TELANGANA / : Jagga Reddy: మంత్రి దామోదర రాజనర్సింహ, తాను కలిసి మూడేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యనించారు. మంత్రి రాజనర్సింహ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి గురువారం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి చిట్ చాట్ చేశారు. ”మెడికల్ కాలేజీ కోసం నేను, దామన్న అనేక పోరాటాలు చేశాం. మా ఇద్దరి పోరాటం వల్లే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చింది. మూడేళ్లు మేమిద్దరం BRSకి చుక్కలు చూపించాం. దామన్నే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కావడం ఇంకా సంతోషమ”ని జగ్గారెడ్డి అన్నారు. విద్యార్థుల ఫిర్యాదు.. అధికారులపై మంత్రి సీరియస్ సంగారెడ్డి వైద్య కళాశాలలో హాస్టల్ సౌకర్యాలు లేవని, ఆడిటోరియం లేదని మంత్రి దామోదర రాజనర్సింహకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదని సీరియస్ అయ్యారు. ఎందుకింత నిర్లక్ష్యం, పని చేయలేకపోతే వెళ్లిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో మోసాలను అరికడతాం అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పారు. సంగారెడ్డికి మరో ఐదు వందల పడకల ఆసుపత్రి అవసరం ఉందని, త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు మంచి సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులతో సమానంగా ప్రభుత్వ దావఖానాల్లో సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న మోసాలను అరికడతామని, 2011 వైద్య చట్టాన్ని పకడ్భందీగా అమలుచేస్తామన్నారు. వైద్యసేవలకు సంబంధించి ధరల పట్టికను ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డిలో ఆయుష్ ఆసుపత్రిని సెప్టెంబర్ లో ప్రారంభిస్తామని, ఏడాదిలో శాశ్వత భవనాలు నిర్మిస్తామని హామీయిచ్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :