Friday, 18 July 2025 06:29:27 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

వైద్య సిబ్బంది బదిలీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు? కోరుకున్న చోట పోస్టింగ్ కోసం రూ.లక్షల్లో చెల్లింపులు?

Date : 09 August 2024 09:53 AM Views : 203

Studio18 News - TELANGANA / : Gossip Garage : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వైద్యులు, సిబ్బంది బదిలీల్లో అంతులేని అవినీతి చేటుచేసుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి. డాక్టర్ల బదిలీల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటున్నారు. ఈ అవినీతి బాగోతంపై ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీస్తోందట. పెద్ద ఎత్తున వసూళ్ల జరిగాయని ప్రభుత్వానికి నివేదిక రెడీ చేసిందంటున్నారు. ఇప్పుడు ఇదే విషయం సెక్రటేరియట్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం లక్షల్లో సమర్పణ? తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సిబ్బంది బదిలీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కోరుకున్న చోట పోస్టింగ్ కోసం ఉద్యోగులు లక్షల్లో సమర్పించుకుంటున్నారని ఆరోపణలు వినిపస్తున్నాయి. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితా తయారు చేసి బదిలీలు చేయాల్సివుండగా, ఈ జాబితాలో కొందరి పేర్లు మాయం చేయడం, మరికొందరి పేర్ల నమోదులో తప్పుడు వివరాలు పొందుపరచడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుసగుసలు.. రాష్ట్రంలో బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో చాలా ఏళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సీట్లను కాపాడుకునేందుకు పైరవీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దిగువస్థాయిలో పనిచేసే నర్సుల నుంచి మొదలుకొని వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల వరకు అంతా ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగేలా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరికొందరు తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ కోరుతూ లక్షల రూపాయలు ముట్టజెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి డైరెక్టరేట్‌లోని కొందరు ఉద్యోగులు, పలు అసోసియేషన్ల నాయకులు వసూళ్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఉద్యోగులు…. పోస్టింగ్‌ కోసం డబ్బు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంత డబ్బైనా చెల్లించడానికి రెడీ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు మరోవైపు సొంతంగా ప్రైవేట్ హాస్పిటళ్లు, క్లినిక్స్ నడుపుతున్నారు. మరికొందరు కార్పొరేట్ హాస్పిటల్స్ లో కన్సల్టెంట్‌ వైద్య సేవలు అందిస్తున్నారు. రెండు వైపులా దండిగా సంపాదిస్తుండటంతో ప్రస్తుతం ఉన్న స్థానంలోనే కొనసాగేలా ప్రయత్నిస్తున్నారు. అక్కడ కుదరదంటే పక్కనే ఉన్న మరోచోటకు బదిలీ చేయాలని కోరుతున్నారట.. ఇలాంటి వారు సౌకర్యమైన పోస్టింగ్ కోసం ఎంత డబ్బైనా చెల్లించడానికి రెడీ అంటున్నారట.. హైదరాబాద్‌ నగరంలో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కువగా ఈ లాబీయింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరోపణలపై రాష్ట్ర పోలీసు ఇంటిలెజెన్స్‌ విభాగం ఫోకస్‌.. నగరంలో చాలాకాలంగా తిష్టవేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి వస్తే జూబ్లీహిల్స్ నుంచి మలక్ పేట్, లేదంటే కోఠి ఆస్పత్రికి బదిలీ చేస్తున్నారని చెబుతున్నారు. ఇలా అటు నుంచి ఇటు… ఇటు నుంచి అటు వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో రాష్ట్ర పోలీసు ఇంటిలెజెన్స్‌ విభాగం ఫోకస్‌ చేసినట్లు చెబుతున్నారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నదీ? ఎవరికీ ఎంత డబ్బు అందుతున్నది ప్రభుత్వానికి నివేదించేందుకు రిపోర్టు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటిలెజెన్స్‌ నివేదికపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సివుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :