Sunday, 08 March 2026 04:01:26 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Date : 19 August 2024 05:09 PM Views : 397

Studio18 News - TELANGANA / : తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్య భారతంలో ఎక్కడ కూడా ఇలా రుణమాఫీ జరగలేదని అన్నారు. మన్మోహన్ సింగ్ దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేసిన తరువాత బీజేపీ ఎప్పుడూ అలా రుణమాఫీ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని, వివిధ కారణాలతో రుణమాఫీ కాని వారికి కూడా చేసి తీరతామని చెప్పారు. ఈ పంట నుంచి సన్నాలకి రూ.500 బోనస్ ఇవ్వబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు రైతుల జీవితాలను ఆగం చేసిందని చెప్పారు. రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్న వారు పై అమౌంట్‌ను బ్యాంక్ లో కట్టాలని, తాము ఆ రెండు లక్షలు మాఫీ చేస్తామని తెలిపారు. వాళ్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు: జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు రుణమాఫీపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రుణమాఫీలో చాలా తప్పులు చేసిందని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు సవాల్ విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీని జీర్ణించుకోలేక పోతున్నాయని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వమూ ఇలా రుణమాఫీ చేయలేదని, తమ ప్రభుత్వం మాత్రమే చేసిందని, తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :