Monday, 08 December 2025 04:44:21 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Revanth Reddy: కవితకు బెయిల్‌పై వ్యాఖ్య.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Date : 29 August 2024 05:03 PM Views : 375

Studio18 News - TELANGANA / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసుపై విచారణ సందర్భంగా పిటిషనర్ జగదీశ్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఒప్పందం వ‌ల్లే, క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌ని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనిని సుప్రీంకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడటమా? అని ప్ర‌శ్నించింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌... ముఖ్యమంత్రి వ్యాఖ్యలను త‌ప్పుబ‌ట్టింది. సీఎం చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లో అనుమానాల‌కు తావిస్తుందన్నారు. తమ ఆదేశాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా తామేమీ బాధ‌ప‌డ‌మ‌ని, కానీ తాము త‌మ అంత‌రాత్మ ప్ర‌కార‌మే విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటామ‌ని పేర్కొంది. సీఎం అంటే బాధ్యతగా ఉండాలని, ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. కోర్టు తీర్పులను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని పేర్కొంది. "రాజ‌కీయ నాయ‌కుల‌ను సంప్ర‌దించి మేం ఆదేశాలు ఇస్తామా? ఎవ‌రి వ్యాఖ్య‌లనూ ప‌ట్టించుకోం.. మా విధిని నిర్వ‌హిస్తాం... ప్ర‌మాణ పూర్వ‌కంగా ప‌ని చేస్తాం. ఎవ‌రి ప‌నుల్లోనూ జోక్యం చేసుకోం. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అంటే గౌర‌వం లేదా? వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల గౌరవం ఉండాలి. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉంటే ఓటుకు నోటు విచార‌ణ రాష్ట్రం బ‌య‌టే నిర్వ‌హిద్దాం" అని జ‌స్టిస్ గ‌వాయ్ ధ‌ర్మాస‌నం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :