Sunday, 16 March 2025 04:18:02 PM
# Omar Abdullah: జమ్మూకశ్మీర్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ఒమర్ అబ్దుల్లా # AP Govt: ఏపీ స‌ర్కార్ ఆసక్తికర నిర్ణ‌యం... ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు! # Pawan Kalyan: ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి # Chegondi Harirama Jogaiah: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు హరిరామజోగయ్య బహిరంగ లేఖ # Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్ # Donald Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం... పాక్ స‌హా 41 దేశాల‌పై ట్రావెల్ బ్యాన్‌...? # Pawan Kalyan: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే స్పందన # Revanth Reddy: చంద్రశేఖర్ రావ్... నీ పిల్లలకు చెప్పు... మాట జారితే ఫలితం అనుభవిస్తారు: సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ # దేశంలో కులగణన చేయాలని ఎన్డీయే ప్రభుత్వానికి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్న మాయావతి సమగ్ర అభివృద్ధి కోసం జనగణన అవసరమని వ్యాఖ్య # Sovereign Bonds: వారి పంట పండింది... రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ # మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న‌ ఐపీఎల్ 2025 2008లో ప్రారంభ‌మైన క్యాష్ రిచ్ లీగ్ కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా # త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్ # విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఉబర్ ఒప్పందం ముంబై ప్రయాణికుల కోసం ప్రత్యేక పథకం # కేసీఆర్ ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారన్న హరీశ్ రావు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం దారుణమని వ్యాఖ్య చంద్రబాబుని # వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు చర్చలు సఫలం కాలేదని యూఎఫ్‌బీయూ వెల్లడి సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది బ్యాంకు ఉద్యోగ # Supritha: క్షమాపణ చెప్పిన సురేఖావాణి కూతురు సుప్రీత... కారణం ఇదే! # Pochampalli Srinivas Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు # Daggubati Purandeswari: పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు # Bank: ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె: యూఎఫ్‌బీయూ # Chiranjeevi: తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

ఊరిస్తున్న పదవులు.. దక్కని గుర్తింపు.. ప్రొఫెసర్‌ కోదండరాంకి చివరికి మిగిలిందేంటి?

Date : 30 July 2024 01:29 PM Views : 70

Studio18 News - TELANGANA / : Gossip Garage : నేను సైతం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఆ నేత… బీఆర్ఎస్‌ను గద్దె దించే వరకు నిద్రలేకుండా శ్రమించారు. కాంగ్రెస్‌ను పవర్లోకి తెచ్చేందుకు రాజకీయంగా త్యాగాలకు సైతం రెడీ అన్నారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసేంతవరకు అవిశ్రాంతంగా పోరాటాలు చేశారు. అధికారం దక్కగానే తగిన గౌరవం ఇస్తామని ఆ ఉద్యమనేతకు చేతిలో చేయ్యేసి చెప్పింది హస్తం పార్టీ… మరి పదవి దక్కిందా? అంటే… ఔనని కాదని చెప్పలేని పరిస్థితి ఆయనది.. ఇస్తామన్న పదవి అలా గాలిలో వేలాడుతుండగా, ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ నేత మెడకు చుట్టుకుంటోంది. దీంతో కక్కలేక.. మింగలేక అన్నట్లు తయారైందట ఆ ఉద్యమ నేత పొలిటికల్ జర్నీ… తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఆచార్య కోదండరాం స్టోరీయే ఇదంతా? కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంకి చివరికి మిగిలిందేంటి? కాంగ్రెస్‌తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు.. తెలంగాణ ఉద్యమంతో ఓ వెలుగు వెలిగిన ఆచార్య కోదండరాం… రాజకీయంగా సక్సెస్ అయ్యారా? లేదా? అన్న ప్రశ్నకు ఎవరూ కచ్చితమైన ఆన్సర్ చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో రాజకీయంగా విభేదించిన కోదండరాం… సొంతంగా పార్టీ పెట్టినా… ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ఐతే సొంతంగా కేసీఆర్‌పై పైచేయి సాధించలేకపోయిన ప్రొఫెసర్ కోదండరాం…. 2018లోనే కాంగ్రెస్‌తో జట్టుకట్టి కారును గ్యారేజీకి పంపాలని శ్రమించినా ఫలితం దక్కలేదు. పట్టు వదలని విక్రమార్కునిలా మరోసారి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా హస్తం పార్టీ విజయానికి దోహదపడ్డ ప్రొఫెసర్ కోదండరాంకి ఇప్పటివరకు ఎలాంటి పదవీ దక్కకపోవడంపై జన సమితి నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా.. ఇంతవరకు ఒక్క పదవీ దక్కలేదు.. ఒక ఎమ్మెల్సీ, రెండు నామినేటెడ్ పోస్టుల హామీతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప్రొఫెసర్ కోదండరాం పార్టీకి ఇంతవరకు ఏ ఒక్క పదవీ దక్కలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా.. కోదండరాంకి కానీ, ఆయన అనుచరులకు కాని ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై తెలంగాణ జనసమితి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత… ఆయన క్యాబినెట్లో కోదండరాంని తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, అది ఉట్టి ప్రచారంగానే మిగిలిపోయింది. అప్పటి నుంచి కోదండరాం పేరు వెయిటింగ్ లిస్టులోనే.. ఆ తర్వాత నిరుద్యోగుల ఆలోచన ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తారని మరో ప్రచారం జరిగింది. ఐతే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించడంతో… కోదండరాం పేరు ఊహాగానాలకే పరిమితమైంది. అదేవిధంగా జనవరిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం పేరును సిఫార్సు చేసినా… కోర్టు జోక్యంతో ఆ నియామకం పెండింగ్‌లో పడిపోయింది. ఇక అప్పటి నుంచి కోదండరాం పేరు వెయిటింగ్ లిస్టులోనే పడిపోయింది. కోదండరామ్ ను టార్గెట్ చేస్తున్న నిరుద్యోగులు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరిస్తున్న పదవులన్నీ… కోదండరాంకి దక్కకపోగా, ఆయనకు బాధ్యతలు ఎక్కువైపోయాయంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ పతనానికి ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్య… ఇప్పుడు కోదండరాం మెడకు చుట్టుకుంటోందట. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు… కోదండరాంనే టార్గెట్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం మాటలు వినే.. తామంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచామని.. కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కోదండరాం ఇంటి ముందు ఆందోళనలకు దిగుతున్నారు నిరుద్యోగులు. ప్రొఫెసర్ కోదండరాంకు పొలిటికల్ కెరీర్ అచ్చిరాలేదంటూ కామెంట్లు.. అటు పదవీ దక్కక… ఇటు ప్రజలు, నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో… ప్రొఫెసర్ కోదండరాంకు పొలిటికల్ కెరీర్ అచ్చిరాలేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం… ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా కీలకంగా పనిచేసిన కోదండరాం…. రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్ల తర్వాత కూడా ప్రభుత్వ పదవి దక్కించుకోలేకపోవడం, ముఖ్యంగా తానెంతో కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం… సీఎం రేవంత్‌రెడ్డి హయాంలోనూ పదవి అందని ద్రాక్షగా మారడంపై రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన తెలంగాణ జనసమితి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తమ నేతకే ఏ దిక్కులేకపోవడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదని టీజేఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రొఫెసర్‌ ఆవేదనను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందా? ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాకపోవడం… కాంగ్రెస్ నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులను కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకుంటుండటం వల్ల టీజేఎస్‌ వర్గాలు ప్రొఫెసర్ కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తనకే ఏ పదవీ లేకపోవడం… తన వారిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఎరక్కపోయి.. ఇరుక్కుపోయామా? అంటూ టీజేఎస్ అధినేత నిర్వేదం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం ఆవేదనను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రొఫెసర్‌ నిరీక్షణకు ఎలాంటి ముగింపు పలుకుతుందో చూడాల్సివుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :