Friday, 14 February 2025 08:25:58 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

HMDA New Layouts : భారీ లే-అవుట్ల రూపకల్పనపై హెచ్‌ఎండీఏ ఫోకస్

Date : 21 July 2024 04:12 PM Views : 76

Studio18 News - TELANGANA / : HMDA New Layouts : నగరంలో పలుచోట్ల కొత్త లే-అవుట్లను డెవలప్‌ చేసి… కొంత ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రచిస్తోంది. రైతుల నుంచి భూములను సేకరించి డెవలప్ చేయాలని హెచ్‌ఎండీఏ ప్లాన్‌ చేస్తోంది. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా ఇతర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని హెచ్‌ఎండీఏ భావిస్తుంది. అంతే కాకుండా ఆ భూములను ప్రభుత్వ నిర్ణయాల మేరకు కేటాయింపులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ల్యాండ్ డెవలప్‌మెంట్‌లో తమ వాటా పెంచాలని చాలా కాలం నుంచి రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు గత సర్కార్‌ ఓకే చెప్పడంతో రైతుల వాటా 60శాతానికి పెరిగింది. దీంతో ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. భూములిచ్చే వారికి పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ శాతం ప్రయోజనం చేకూరుతుంది.భూములు ఇచ్చే వారికి ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లే-అవుట్లుగా మార్చాలంటే నాలా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కాని హెచ్‌ఎండీఏకు భూములు అప్పజెప్పితే వాటికి నాలా చార్జీలతో పాటు పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్‌ఎండీఏ భరిస్తుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్‌ఎండీఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది. భూములు ఇచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం : ఇక టీఎస్ఐఐసీకి చెందిన భూములను ఇటీవల హెచ్‌ఎండీఏ ఆన్ లైన్ వేలంలో విక్రయించింది. దీంతో భారీ ఆదాయం వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భూములకు ఎకరానికి 100 కోట్ల రూపాయల ధర కూడా పలికింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేట్, బుద్వేల్, మోకిలా, షాబాద్ తదితర ప్రాంతాల్లో వేసిన లే-అవుట్లలో ప్లాట్లను విక్రయించి వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది హెచ్‌ఎండీఏ. అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లోని భూములను వివిధ అవసరాల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టింది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్‌, న్యూ వర్క్ సెంటర్లను డెవలప్‌ చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. దీనికోసం భూ యజమానులు, రైతులు, పట్టాదారులు ఒంటరిగా లేదా సమూహంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 50 ఎకరాలు.., ఔటర్ రింగ్ రోడ్డు బయట 100 ఎకరాలు కనీసంగా ఉండాలని అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ల వద్ద ఎక్కువ లే-అవుట్లు ఉండేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఎక్కువ లే-అవుట్లు వేయాలనే లక్ష్యంతో ఉంది హెచ్‌ఎండీఏ. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ సమీపంలోని భూములకు భారీ డిమాండ్‌ ఉంది. వీటిని డెవలప్‌ చేస్తే వేలంలో భారీ ధర పలుకుతుందని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. అంతే కాకుండా ఒకే చోట ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తుండడంతో కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అదే ప్రాంతంలో 150, 200 గజాల స్థలం కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. దాంతో అందరికీ అందుబాటులో ఉండేలా లే-అవుట్ల రూపకల్పనపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇక సిటీ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, భోగారం, లేమూరు, దండు మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 9 వందల ఎకరాలకు పైగా భూమిని డెవలప్‌మెంట్‌ కోసం అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక ఒక ఎకరం 4 వేల 840 గజాల భూమిని డెవలప్ చేస్తే అందులో 40 శాతం రోడ్లు మరియు గ్రీనరీకి పోతుంది. మిగిలిన 2904 గజాల్లో 60 శాతం వాటా అంటే ఒక వెయ్యి 742 గజాలు భూయజమానికి, 40 శాతం వాటాలో 11 వందల 62 గజాల భూమి హెచ్‌ఎండీఏకు చెందుతుంది. ఇలా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11వేల ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు 10 వేల ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో, అలాగే ప్రధానమైన జంక్షన్ల వద్ద ఉండేలా ప్లాన్‌ చేస్తోంది హెచ్‌ఎండీఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు…, ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :