Monday, 08 December 2025 03:46:35 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం.. దట్టంగా వ్యాపించిన పొగలు

Date : 23 August 2024 05:54 PM Views : 290

Studio18 News - TELANGANA / : secunderabad paradise hotel: సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. సెల్లార్‌లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో హోటల్‌లోని కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో హోటల్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. సెల్లార్‌లోని జనరేటర్ గదిలో మంటలు అంటుకున్నట్టు ఫైర్ సిబ్బంది గుర్తించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో జనరేటర్ హీట్ అవ్వడంతో అగ్నిప్రమాదం జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారి షబీర్ అలీ తెలిపారు. జనరేటర్ గదిలో స్క్రాప్, పేపర్లు ఉండడంతో మంటలు వ్యాపించాయని.. ఒక్కసారిగా ప్రజలు, కస్టమర్లు భయాందోళనకు గురయ్యారని చెప్పారు. స్వల్ప అగ్ని ప్రమాదమే అయినా దట్టంగా పొగలు వ్యాపించాయని, మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. పారడైజ్ హోటల్ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. జనరేటర్ హీట్ అవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :