Friday, 14 February 2025 07:57:19 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

SR nagar boys hostel: హైదరాబాద్‌లోని హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం.. భారీగా మత్తుపదార్థాలు స్వాధీనం

Date : 02 August 2024 05:23 PM Views : 69

Studio18 News - TELANGANA / : హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ బాయ్స్ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్ సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్లో పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గత కొన్నాళ్ల నుంచి బాయ్స్ హాస్టల్‌కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకులను అరెస్ట్ చేశారు. మరోవైపు, నగరంలోని పలు బాయ్స్ హాస్టళల్లో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసి సుమారుగా 12 లక్షలు రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులు అరెస్టయ్యారు. మాదాపూర్ రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి వివరాలు సేకరించిన క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. బెంగళూరుకు చెందిన మోహిత్ లోకేశ్ రావు పసుపులేటి దత్తు, కె.ఎం రవూఫ్, నైజీరియాకు చెందిన నెగ్గెన్ తో సంబంధాలు ఉన్నాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఇటీవల మాదాపూర్ లోనీ క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్ లో ఓ రేవ్ పార్టీ భగ్నం చేశామని, 20 మందిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నాగరాజు యాదవ్ తో పాటు మరో నిందితుడ్ని అరెస్ట్ చేశామని, వారిని విచారించే క్రమంలో బెంగళూరు నుండి హైదరాబాదు కు డ్రగ్స్ వస్తున్న విషయం వెల్లడయిందని తెలిపారు. దీంతో మరింత లోతుగా ఈ కేసును విచారించినపుడు ఎస్సార్ నగర్ లో హాస్టల్స్ కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ గుట్టు రట్టయిందని చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి, రవూఫ్ ను అరెస్టు చేశామమని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :