Friday, 14 February 2025 07:06:27 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Hyderabad Police: హైదరాబాద్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

Date : 04 August 2024 11:31 AM Views : 99

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా, నిరంతరం తనిఖీలు చేస్తున్నా పెద్ద ఎత్తున గంజాయిని కంటైనర్ లో పట్టుబడటం పోలీసులకు సవాల్ గా మారుతోంది. శనివారం రాత్రి పెద్ద అంబర్ పేట వైపు నుండి గచ్చిబౌలి వైపు వెళుతున్న ఒక కంటైనర్ లో సుమారు 800 కేజీల గంజాయి ఉండడాన్ని గమనించిన బాలానగర్ ఎస్ వో టీ పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో పోలీసులు వెల్లడించనున్నారు. ఒడిశా నుండి ఓ ముఠా ఈ గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ గంజాయి తరలింపు వెనుక ఎవరు ఉన్నారు. ఎక్కడకు వెళుతుంది అనే వివరాలు పోలీసుల విచారణలో తేలనుంది. అయితే ఓ పక్క తెలుగు రాష్ట్రాల పోలీసులు గంజాయి అక్రమ రవాణా నిరోధానికి చర్యలు చేపడుతున్న వేళ ఒడిశా నుంచి అన్ని చెక్ పోస్టులను దాటుకుని హైదరాబాద్ వరకూ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :