Studio18 News - TELANGANA / : కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్రమంత్రిని కలిశారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3లో చేర్చాలని వారు కేంద్రమంత్రిని కోరారు. ఇందుకు సంబంధించి సమర్పించిన డీపీఆర్ను ఆమోదించాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం, ఉపముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రాంతంలోని గ్రామాలు, మండలాలకు నెట్ వర్క్ కల్పించడమే టీ ఫైబర్ లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం.. కేంద్రమంత్రికి తెలిపారు. 65 వేల ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
Admin
Studio18 News