Saturday, 24 January 2026 07:47:31 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

సుప్రీంకోర్టు 4 రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు చేయాలి: కేంద్రానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అప్పీల్

Date : 07 August 2024 04:36 PM Views : 364

Studio18 News - TELANGANA / : BRS party legal cell: న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు సుప్రీంకోర్టు నాలుగు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ కోరింది. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధాన కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ మూడు పిల్లర్లు. 18వ లా కమీషన్ సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా రీజినల్ బెంచులు ఏర్పాటు చేయాలని చెప్పింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా ముంబై, కలకత్తా, హైదరాబాద్ లేదా చెన్నైలో ఏర్పాటు చేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు అంశం కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంటులో చెప్పారు. దేశ సమగ్రతకు విఘాతమని బ్రెంచ్‌లు ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఒప్పుకోవడం లేదని కేంద్ర మంత్రి చెప్పారు. నేను గతంలో పార్లమెంటులో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టాను. సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసే అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బదులు రాష్ట్రపతి అని పేర్కొనాలని నా బిల్లులో పేర్కొన్నాను. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 4 కోట్ల కేసులు జిల్లా కోర్టుల్లో ఉన్నాయి. 2 లక్షల కేసులు 30 సంవత్సరాలుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 90 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు బెంచ్‌లు ఉండాలని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా చెప్పారు. జనాభాకు అనుగుణంగా జడ్జీల సంఖ్య లేకపోవడంతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. న్యాయమూర్తులపై ఒత్తిడి పెరిగితే జడ్జిమెంట్ల యొక్క క్వాలిటీ దెబ్బ తింటుంది. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఎందుకు ఉండాలి ఎక్కువ మంది వుంటే ఏమవుతుంది? రాష్ట్రవిభజన జరిగినప్పుడు ఏపీకి 37, తెలంగాణకు 24 మంది జడ్జీలను మాత్రమే కేటాయించారు. మేము అధికారంలోకి వచ్చాక తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచుకున్నాం. కేసులు త్వరగా పరిష్కారమైతే న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :