Saturday, 26 April 2025 06:24:12 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు 4 రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు చేయాలి: కేంద్రానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అప్పీల్

Date : 07 August 2024 04:36 PM Views : 98

Studio18 News - TELANGANA / : BRS party legal cell: న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు సుప్రీంకోర్టు నాలుగు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ కోరింది. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటుపై కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రధాన కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ మూడు పిల్లర్లు. 18వ లా కమీషన్ సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా రీజినల్ బెంచులు ఏర్పాటు చేయాలని చెప్పింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సుప్రీంకోర్టు ఢిల్లీలో కాకుండా ముంబై, కలకత్తా, హైదరాబాద్ లేదా చెన్నైలో ఏర్పాటు చేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు రీజినల్ బ్రెంచ్‌లు ఏర్పాటు అంశం కేంద్ర పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి పార్లమెంటులో చెప్పారు. దేశ సమగ్రతకు విఘాతమని బ్రెంచ్‌లు ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఒప్పుకోవడం లేదని కేంద్ర మంత్రి చెప్పారు. నేను గతంలో పార్లమెంటులో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టాను. సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసే అధికారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బదులు రాష్ట్రపతి అని పేర్కొనాలని నా బిల్లులో పేర్కొన్నాను. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 4 కోట్ల కేసులు జిల్లా కోర్టుల్లో ఉన్నాయి. 2 లక్షల కేసులు 30 సంవత్సరాలుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో 90 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు బెంచ్‌లు ఉండాలని మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా చెప్పారు. జనాభాకు అనుగుణంగా జడ్జీల సంఖ్య లేకపోవడంతో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. న్యాయమూర్తులపై ఒత్తిడి పెరిగితే జడ్జిమెంట్ల యొక్క క్వాలిటీ దెబ్బ తింటుంది. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలు ఎందుకు ఉండాలి ఎక్కువ మంది వుంటే ఏమవుతుంది? రాష్ట్రవిభజన జరిగినప్పుడు ఏపీకి 37, తెలంగాణకు 24 మంది జడ్జీలను మాత్రమే కేటాయించారు. మేము అధికారంలోకి వచ్చాక తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచుకున్నాం. కేసులు త్వరగా పరిష్కారమైతే న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :