Wednesday, 12 November 2025 03:59:29 AM
# Shaheen: మా అమ్మాయి ఉగ్రవాదా?... నమ్మలేకపోతున్నాను!: డాక్టర్ షాహీన్ తండ్రి ఆవేదన # Ajith Kumar: సినీ నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు # Ambati Rambabu: ఓ మై గాడ్... నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది: పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ # Bharati Dixit: ఐఏఎస్ అయిన నా భార్త వేధిస్తున్నాడు.. కిడ్నాప్ కూడా చేశాడు: ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు # Chandrababu Naidu: అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్... ఏపీ సమస్యలు వివరించిన సీఎం చంద్రబాబు # Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం # Chhattisgarh Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... ఆరుగురు మావోయిస్టుల మృతి # Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు: ఎగ్జిట్ పోల్ సర్వేలు # Bihar Elections: బీహార్‌లో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం... ముక్తకంఠంతో చెబుతున్న ఎగ్జిట్ పోల్స్‌! # Amit Shah: ఎర్రకోట కారు బాంబు పేలుడు ఘటన... అధికారులకు అమిత్ షా ఆదేశాలు # India Russia Relations: భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు # Sanju Samson: సంజూ శాంసన్‌కు సీఎస్‌కే బర్త్‌డే విషెస్.. ఆ మెగా డీల్‌పై స్పష్టమైన సంకేతమా? # Delhi Blast: ఢిల్లీని వణికించిన కారు.. చాలా చేతులు మారిందా?.. దర్యాప్తులో కీలక విషయాలు # Delhi blast: పట్టుబడతాననే భయంతోనే.. ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! # Naseem Shah: పాక్ క్రికెటర్ నసీమ్ షా ఇంటిపై కాల్పులు # HR Department: హెచ్‌ఆర్ పొరపాటు.. సీఈఓ సహా అందరికీ ఫైరింగ్ మెయిల్! # Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై భూకబ్జా కేసు.. ఫిల్మ్‌నగర్‌లో కలకలం # Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి # Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌! # Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ గాయంపై సంచలన విషయాలు.. అప్పుడు ఆక్సిజన్ 50కి పడిపోయింది!

Thummala: రుణమాఫీ కాకపోయినప్పటికీ రైతులు ఆందోళన చెందవద్దు: తుమ్మల నాగేశ్వరరావు

Date : 06 August 2024 03:45 PM Views : 254

Studio18 News - TELANGANA / : రుణమాఫీ కాకపోయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ సరిగ్గా జరగలేదనే భావన రైతుల్లో ఉందన్నారు. ఓఆర్ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సరైన పద్ధతిలో రుణమాఫీ జరగలేదని... ఇప్పుడు మాత్రం తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ అంశంలో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతలు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పాస్ బుక్ లేకపోయినా... తెల్లకార్డు ద్వారా రుణమాఫీ చేస్తున్నామన్నారు. రుణాలు మాఫీ లేకపోయినా ఎవరికీ ఆందోళన వద్దన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. ఈ పొరపాట్లు సరిచేసి అర్హులందరినీ రుణవిముక్తుల్ని చేస్తామన్నారు. ఆగస్ట్ 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైరాలో ప్రారంభిస్తారన్నారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :