Thursday, 15 May 2025 02:28:24 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Indian Railways: వరుస సెలవులు... తెలుగు రాష్ట్రాల ముఖ్య నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్

Date : 16 August 2024 05:24 PM Views : 125

Studio18 News - TELANGANA / : వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేడు వరలక్ష్మీ వ్రతం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం నాడు రక్షాబంధన్ కాగా.... ఈ నేపథ్యంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. నర్సాపూర్ - సికింద్రాబాద్, కాకినాడ - సికింద్రాబాద్, కాచిగూడ - తిరుపతి మధ్య మొత్తం ఎనిమిది రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాచిగూడ - తిరుపతి రైలు ఆగస్ట్ 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి... 17వ తేదీ ఉదయం 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి - కాచిగూడ రైలు ఆగస్ట్ 17న తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి... 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. కాకినాడ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 18న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి... 19న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ - కాకినాడ రైలు ఆగస్ట్ 19న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 20వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. నర్సాపూర్ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 18న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి, 19న ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 17, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి 18న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరనున్న ఈ రైలు 19, 21 తేదీల్లో ఉదయం 6.30 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :