Monday, 24 March 2025 06:38:08 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

Date : 31 July 2024 03:08 PM Views : 114

Studio18 News - TELANGANA / : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని యువత చెప్పినా తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. తమ హయాంలో పరీక్షలు జరిగి, ఫలితాలు వస్తే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం విడ్డూరమన్నారు. 'అశోక్ నగర్ చౌరస్తాకు సెక్యూరిటీ లేకుండా వెళ్దాం... అక్కడి యువకులను అడుగుదాం... రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగం ఇచ్చారని చెబితే నేను రాజీనామా చేసి వెళ్తా. అక్కడకు సీఎం రేవంత్ రెడ్డి వస్తానని చెప్పినా సరే'నని కేటీఆర్ సవాల్ చేశారు. మందికి పుట్టిన బిడ్డలను తమ బిడ్డలుగా చెప్పుకోవద్దని సూచించారు. విద్యార్థులు పోస్టులు పెంచమంటే పోలీస్ జులుం, పరీక్షలు వాయిదా వేయమంటే అరెస్టులు... ఇదేమిటని నిలదీశారు. వాయిదా వేయమని విద్యార్థులు అడిగితే... వారిని సన్నాసులు అని సీఎం అనడం సరికాదన్నారు. ఎవరైతే అధికారం ఇచ్చారో... ఆ నిరుద్యోగులను పట్టుకొని కోచింగ్ సెంటర్ల కోసం వాయిదా కోరుతున్నారని ఆరోపించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయమంటే సంక్షోభం... కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు.. కాంగ్రెస్ రాగానే సాగునీరు కట్ అయి పంటలు ఎండిపోయాయి... రైతుబంధు కూడా కట్ అయిందని విమర్శించారు. అందుకే రైతుబంధు తెచ్చాం రైతుల బతుకులు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్లు రైతులకూ ఇవ్వాలన్నారు. అందుకే తాము రైతుబంధును తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం సంక్షోభంలో మునిగి... రైతు వెన్ను విరిగి... పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీలో పదుల ఎకరాలు ఉన్న రైతులు కూడా నీరు లేక పంటలు పండించే పరిస్థితి లేక... బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. అందుకే తాము రైతుబంధు తెచ్చామన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరు ఉద్యోగాలు ఎందుకివ్వలేదు: సీతక్క ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. పదేళ్లపాటు ఓయూకు వెళ్లలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఆశావర్కర్లు, అంగన్వాడీల పెన్షన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. చిరు ఉద్యోగుల తల్లిదండ్రుల పెన్షన్ తీసేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ వేధింపులు తట్టుకోలేకనే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు ఇవ్వలేదని విమర్శించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదు: శ్రీధర్ బాబు దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కిన బీఆర్ఎస్‌కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గుజరాత్ వద్దన్న ఫసల్ బీమా మనకెందుకు?: కేటీఆర్ ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని, కానీ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ వద్దని చెబుతున్న ఇందులోకి మనం వెళ్లడం ఏమిటన్నారు. ఏకకాలంలో రుణమాఫీ అని చెబుతూ... రెండుసార్లు ప్రకటన ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తేనే 16 వేల కోట్లు అయిందని, మరి మీరు లక్షన్నర రుణమాఫీ చేస్తే రూ.12 వేల కోట్లే ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ఎన్ని కోతలు జరుగుతున్నాయో దీనిని బట్టి తెలుసుకోవచ్చన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :